ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ కేసులో ఈడీ పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఛార్మి, పూరి జగన్నాథ్ ల విచారణ పూర్తయ్యింది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ ఇప్పుడే ఈడి కార్యాలయానికి చేరుకుంది. అయితే ఈడి అధికారుల కంటే ముందే ఆమె ఈడి కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. ఈరోజు ఉదయం 10:30కి ఈడి కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ కు నోటీసులు అందాయి. కానీ రకుల్ మాత్రం ఉదయం 9:10కి ఈడి కార్యాలయానికి చేరుకుంది. రకుల్ తో పాటు ఒక న్యాయవాది, రకుల్ మేనేజర్, రకుల్ సిఎ కూడా వచ్చారు. ఆరెంజ్ కలర్ ఫైల్ చేత్తో పట్టుకుని ఈడి ఆఫీస్ కు చేరుకుంది రకుల్. తనకు చెందిన పలు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్ లను విచారణ కోసం తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసు లో రకుల్ విచారణ పప్రారంభమైంది. 2016లో నవదీప్ ఎఫ్ క్లబ్ లో పార్టీకి రకుల్, రానా దగ్గుబాటి అటెండ్ అయ్యారు. అదే పార్టీ లో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేశాడు. పార్టి ఫుటేజ్ ఆధారంగా రకుల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ ఎంతసేపు జరుగుతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : మణిరత్నంపై కేసు నమోదు
Also Read
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. మరో డేట్ ఇవ్వాలని అధికారులకు విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పారు.
సుమారు 10 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్లో కెల్విన్ చాటింగ్ వివరాలపై కూపీ లాగారు. మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరి జగన్నాథ్, చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానుంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
- Tags
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!