ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ కేసులో ఈడీ పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఛార్మి, పూరి జగన్నాథ్ ల విచారణ పూర్తయ్యింది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ ఇప్పుడే ఈడి కార్యాలయానికి చేరుకుంది. అయితే ఈడి అధికారుల కంటే ముందే ఆమె ఈడి కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. ఈరోజు ఉదయం 10:30కి ఈడి కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ కు నోటీసులు అందాయి. కానీ రకుల్ మాత్రం ఉదయం 9:10కి ఈడి కార్యాలయానికి చేరుకుంది. రకుల్ తో పాటు ఒక న్యాయవాది, రకుల్ మేనేజర్, రకుల్ సిఎ కూడా వచ్చారు. ఆరెంజ్ కలర్ ఫైల్ చేత్తో పట్టుకుని ఈడి ఆఫీస్ కు చేరుకుంది రకుల్. తనకు చెందిన పలు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్ లను విచారణ కోసం తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసు లో రకుల్ విచారణ పప్రారంభమైంది. 2016లో నవదీప్ ఎఫ్ క్లబ్ లో పార్టీకి రకుల్, రానా దగ్గుబాటి అటెండ్ అయ్యారు. అదే పార్టీ లో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేశాడు. పార్టి ఫుటేజ్ ఆధారంగా రకుల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ ఎంతసేపు జరుగుతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : మణిరత్నంపై కేసు నమోదు
Also Read
- Pesara Idli: పెసరట్టు కాదు.. 'పెసర ఇడ్లీ' ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
- Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
- Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
- Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. మరో డేట్ ఇవ్వాలని అధికారులకు విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పారు.
సుమారు 10 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్లో కెల్విన్ చాటింగ్ వివరాలపై కూపీ లాగారు. మనీలాండరింగ్ చట్టం కింద 12 మంది సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరి జగన్నాథ్, చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానుంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
- Tags
తాజావార్తలు
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
-
Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్సా? వైరల్ ఫొటోతో వార్తల్లోకి జాన్వీ పెళ్లి
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!