Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.
నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి ఆంటీ మైక్రో బయల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండికి అంత విలువ. వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిళ్లలో వెండి నాణేలు వేసుకుని తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవాళ్లట.
Also Read
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
- Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారంటే.. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సి ఉండేది. పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో మట్టిదారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాలి పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుందనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ కాలంలో సిమెంట్ రోడ్లు, వాహనాలు రావడంతో వెండి వాడకం తగ్గిపోతూ వస్తుంది. అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలను ధరించాలనే ఆచారం పాటించేవాళ్లు చాలా మందే ఉన్నారు.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?