Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.
నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి ఆంటీ మైక్రో బయల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండికి అంత విలువ. వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిళ్లలో వెండి నాణేలు వేసుకుని తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవాళ్లట.
Also Read
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారంటే.. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సి ఉండేది. పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో మట్టిదారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాలి పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుందనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ కాలంలో సిమెంట్ రోడ్లు, వాహనాలు రావడంతో వెండి వాడకం తగ్గిపోతూ వస్తుంది. అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలను ధరించాలనే ఆచారం పాటించేవాళ్లు చాలా మందే ఉన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!