Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.
నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి ఆంటీ మైక్రో బయల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండికి అంత విలువ. వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిళ్లలో వెండి నాణేలు వేసుకుని తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవాళ్లట.
Also Read
- Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ".. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారంటే.. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సి ఉండేది. పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో మట్టిదారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాలి పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుందనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ కాలంలో సిమెంట్ రోడ్లు, వాహనాలు రావడంతో వెండి వాడకం తగ్గిపోతూ వస్తుంది. అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలను ధరించాలనే ఆచారం పాటించేవాళ్లు చాలా మందే ఉన్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!