Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.
నిజానికి బంగారంతో పోలిస్తే వెండిలో గొప్ప వైద్య గుణాలు ఉంటాయి. వెండి ఆంటీ మైక్రో బయల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది. అందుకే వెండికి అంత విలువ. వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిళ్లలో వెండి నాణేలు వేసుకుని తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతున్నామని భావించేవాళ్లట.
Also Read
- Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
- PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
కాళ్లకు వెండి మాత్రమే ఎందుకు ధరిస్తారంటే.. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సి ఉండేది. పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో మట్టిదారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. అప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాళ్లకు కంకణాలుగా ధరించేవాళ్లు. కాలి పగుళ్లను కూడా వెండి తగ్గిస్తుందనేది ప్రజల నమ్మకం. అంతేకాకుండా మహిళలు ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు. అయితే ఈ కాలంలో సిమెంట్ రోడ్లు, వాహనాలు రావడంతో వెండి వాడకం తగ్గిపోతూ వస్తుంది. అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలను ధరించాలనే ఆచారం పాటించేవాళ్లు చాలా మందే ఉన్నారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!