NTV Telugu Site icon

Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

Airtel

Airtel

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం మరో రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో సెంకడరీ సిమ్‌గా ఎయిర్‌టెల్‌ను వాడుతూ.. ఆ సిమ్‌ను యాక్టివ్‌గా మాత్రమే ఉంచుతుంటారు. దాని నుంచి డాటాను గానీ, కాల్స్‌గానీ తక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ స్మార్ట్‌ ప్లాన్‌ పేరుతో రూ.99కే ఓ రీఛార్జ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే.. తక్కువ రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ రీఛార్జ్‌ని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్‌ ప్లాన్‌ రీఛార్జ్‌తో 200 ఎంబీ డాటాతో పాటు, 99 రూపాయల టాక్‌టైం వస్తుంది. అలాగే లోకల్‌ కాల్సకు సెకన్‌కు 1పైసా చొప్పున వర్తిస్తుంది. అలాగే ఒక ఎస్‌ఎంఎస్‌కు ఒక్క రూపాయి, ఎస్టీడీ ఎస్‌ఎంఎస్‌లకు రూ.1.5 పైసా చొప్పున్న వర్తి్స్తుంది. అయితే.. గత నవంబర్ నెలలో రూ.79 ఉన్న ఈ ప్లాన్‌ను రూ.99కి మార్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.