సౌత్ స్టార్ హీరోలకు కొంత వరకూ ఓటీటీలపై చిన్న చూపు ఉందేమోగానీ… బాలీవుడ్ లో సీజన్ మారిపోయింది. వరుస లాక్ డౌన్ లు, థియేటర్ల మూసివేతతో డిజిటల్ స్ట్రీమింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు బీ-టౌన్ స్టార్స్. ఇప్పటికే కొందరు క్రేజ్, సీనియారిటీ ఉన్న హీరోలు వెబ్ సిరీస్ లతో సత్తా చాటగా తాజాగా అజయ్ దేవగణ్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు.
‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ పేరుతో డిస్నీ హాటస్టార్ వీఐపీ ప్లాట్ ఫామ్ పై అజయ్ తొలి వెబ్ సిరీస్ విడుదల కానుంది. అయితే, జూలై 21న బీబీసీ స్టూడియోస్ వారి ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటూ ముంబైలోని చాలా ఐకానిక్ లొకేషన్స్ లో చీత్రకరణ జరుపుతారు. ఇంకో విశేషం ఏంటంటే… ‘రుద్ర’ వెబ్ సిరీస్ లో మన టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఫీమేల్ లీడ్ గా నటించనుంది. ఆమె ఇప్పటికే ‘ద ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే నెక్ట్స్ రూపొందించబోతోన్న సిరీస్ లో నటిస్తోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాశీ ఖన్నా సెకండ్ ఓటీటీ ప్రాజెక్ట్ గా ‘రుద్ర’ నిలవనుంది.
‘రుద్ర’ వెబ్ సిరీస్ బీబీసి వారి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ‘లూథర్’కి అఫీషియల్ రీమేక్. ఇండియాలో బీబీసీ స్టూడియోస్ తో కలసి అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ‘రుద్ర’… ఓ పోలీస్ డిటెక్టివ్ కథ. అతను ఒక సైకోపాత్ అండ్ మర్డర్ తో అనుకోని పరిస్థితుల్లో స్నేహం చేస్తాడు. వారిద్దరూ పలు కేసుల్ని ఆసక్తిర పరిణామాల నడుమ పరిష్కారిస్తారు.