‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ ఎందుకు రాలేదు? కారణం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆయన శిష్యుడు, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా సినిమా కాబట్టి దర్శకుడు సుకుమార్ ముంబైలో మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన హాజరుకాలేకపోయినట్లు వివరించాడు. సుకుమార్ను ఎన్నో ఏళ్లుగా తాను చూస్తున్నానని… ఆయన కష్టం అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదని బుచ్చిబాబు తెలిపాడు. కొద్దిగా సర్దుబాటు చేసుకుని అయినా ఈ కార్యక్రమానికి రావాలని తాను చెప్పానని.. కానీ ఈ సినిమా ప్రీమియర్లను మరో మూడురోజుల్లో యూఎస్ఏలో ప్రదర్శించాల్సి ఉందని.. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే క్వాలిటీలో రాజీపడకూడదని.. అందుకే తాను దగ్గరుండి ఆ కార్యక్రమాలు చూసుకోవాలని సుకుమార్ తనకు చెప్పినట్లు బుచ్చిబాబు వెల్లడించాడు.
Also Read
సినిమా తీసినోడు పోతాడు.. సినిమా చూసినోడు పోతాడు.. కానీ సినిమా ఒక్కటే శాశ్వతంగా ఉంటుందని.. ఆ సినిమా బాగా రావాలని తన ఆకాంక్ష అని సుకుమార్ చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ సూపర్గా ఉంటుందని.. తాను ఐదారు సార్లు ఈ మూవీ రషెస్ చూశానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ చూసిన వారిపై వారం, పదిరోజుల పాటు ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండిపోతుందన్నాడు. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక చాలా అందంగా ఉందని.. స్వామి.. నా స్వామి పాటలో ఆమె యాటీట్యూడ్ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ విషయానికి వస్తే ఒకేసారి 10 సినిమాలను నిర్మిస్తున్నారని.. ఈ బ్యానర్ నిర్మాతలకు సినిమా అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి చెప్పవచ్చని బుచ్చిబాబు అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!