‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ ఎందుకు రాలేదు? కారణం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆయన శిష్యుడు, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా సినిమా కాబట్టి దర్శకుడు సుకుమార్ ముంబైలో మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన హాజరుకాలేకపోయినట్లు వివరించాడు. సుకుమార్ను ఎన్నో ఏళ్లుగా తాను చూస్తున్నానని… ఆయన కష్టం అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదని బుచ్చిబాబు తెలిపాడు. కొద్దిగా సర్దుబాటు చేసుకుని అయినా ఈ కార్యక్రమానికి రావాలని తాను చెప్పానని.. కానీ ఈ సినిమా ప్రీమియర్లను మరో మూడురోజుల్లో యూఎస్ఏలో ప్రదర్శించాల్సి ఉందని.. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే క్వాలిటీలో రాజీపడకూడదని.. అందుకే తాను దగ్గరుండి ఆ కార్యక్రమాలు చూసుకోవాలని సుకుమార్ తనకు చెప్పినట్లు బుచ్చిబాబు వెల్లడించాడు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
సినిమా తీసినోడు పోతాడు.. సినిమా చూసినోడు పోతాడు.. కానీ సినిమా ఒక్కటే శాశ్వతంగా ఉంటుందని.. ఆ సినిమా బాగా రావాలని తన ఆకాంక్ష అని సుకుమార్ చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ సూపర్గా ఉంటుందని.. తాను ఐదారు సార్లు ఈ మూవీ రషెస్ చూశానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ చూసిన వారిపై వారం, పదిరోజుల పాటు ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండిపోతుందన్నాడు. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక చాలా అందంగా ఉందని.. స్వామి.. నా స్వామి పాటలో ఆమె యాటీట్యూడ్ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ విషయానికి వస్తే ఒకేసారి 10 సినిమాలను నిర్మిస్తున్నారని.. ఈ బ్యానర్ నిర్మాతలకు సినిమా అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి చెప్పవచ్చని బుచ్చిబాబు అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!