‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ ఎందుకు రాలేదు? కారణం ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆయన శిష్యుడు, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా సినిమా కాబట్టి దర్శకుడు సుకుమార్ ముంబైలో మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన హాజరుకాలేకపోయినట్లు వివరించాడు. సుకుమార్ను ఎన్నో ఏళ్లుగా తాను చూస్తున్నానని… ఆయన కష్టం అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదని బుచ్చిబాబు తెలిపాడు. కొద్దిగా సర్దుబాటు చేసుకుని అయినా ఈ కార్యక్రమానికి రావాలని తాను చెప్పానని.. కానీ ఈ సినిమా ప్రీమియర్లను మరో మూడురోజుల్లో యూఎస్ఏలో ప్రదర్శించాల్సి ఉందని.. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే క్వాలిటీలో రాజీపడకూడదని.. అందుకే తాను దగ్గరుండి ఆ కార్యక్రమాలు చూసుకోవాలని సుకుమార్ తనకు చెప్పినట్లు బుచ్చిబాబు వెల్లడించాడు.
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
సినిమా తీసినోడు పోతాడు.. సినిమా చూసినోడు పోతాడు.. కానీ సినిమా ఒక్కటే శాశ్వతంగా ఉంటుందని.. ఆ సినిమా బాగా రావాలని తన ఆకాంక్ష అని సుకుమార్ చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ సూపర్గా ఉంటుందని.. తాను ఐదారు సార్లు ఈ మూవీ రషెస్ చూశానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ చూసిన వారిపై వారం, పదిరోజుల పాటు ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండిపోతుందన్నాడు. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక చాలా అందంగా ఉందని.. స్వామి.. నా స్వామి పాటలో ఆమె యాటీట్యూడ్ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ విషయానికి వస్తే ఒకేసారి 10 సినిమాలను నిర్మిస్తున్నారని.. ఈ బ్యానర్ నిర్మాతలకు సినిమా అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి చెప్పవచ్చని బుచ్చిబాబు అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!