Tejasvi Surya: బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో లేని తేజస్వి సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి బిజెపి యువ నేతల్లో ఒకరైన తేజస్వి సూర్యని తప్పించింది. అయితే, బీజేపీ బుధవారం విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేదు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర, కేంద్రం నుంచి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడి ఉన్న తేజస్వీ సూర్య.. బెంగళూరు సౌత్ పార్లమెంటు సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పార్టీ హిందుత్వ ఎజెండాకు ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై విమర్శలకు అతను ప్రసిద్ధి చెందాడు.
Also Read:Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి సూర్యను తప్పించడం అనేది పార్టీలో అతని పట్ల ప్రతికూల దృక్పథానికి సంకేతం కాదని బీజేపీ వర్గాలు తెలిపాయి. సూర్య పార్టీ కోసం ఎలాగూ ప్రచారం చేస్తున్నాడని కాషాయ నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అన్ని సమయాలలో ప్రచారం చేసే బాధ్యత ఉందన్నారు. సూర్య జాబితా నుండి లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచారంలో అతను కనిపించడం లేదని అర్థం కాదని చెబుతున్నారు. ఈ విషయంపై సూర్య ఇంకా స్పందించలేదు. యువ నేతలందరినీ జాబితా నుంచి తప్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read: Judges Transfer : తెలంగాణలో భారీగా జడ్జీల బదీలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని తేజస్వి సూర్యను కొందరు నేతలు కోరారు. రేపు పుత్తూరు, బైందూరు, షిమోగాలలో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. షికారిపుర స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను కూడా బీజేపీ చేర్చుకోలేదు. జూలైలో తన తండ్రి రాజీనామా చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తం 224 మంది స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్), బిజెపి గట్టి పోటీ ఉంది. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!