What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం కాన్పూర్ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు.
- నేడు హర్యానా కేబినెట్ విస్తరణ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది.
- నేడు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరుగనుంది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరుగనున్న ఈ ఆయిల్ ఫామ్ సమ్మిట్ కు 9 రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు హజరుకానున్నారు. ఆయిల్ సాగు, ఎగుమతిపై సమ్మిట్లో చర్చించనున్నారు.
- నేడు హైదరాబాద్లో సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో 317తో స్థానికతను కోల్పోయిన టీచర్లను సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
- ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు, సినిమా థియేటర్ల మూసివేత జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత, టికెట్ ధరలపై ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశారు.
- నేడు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి, ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు, జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
- నేడు ఉదయం 11.30 గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం నిర్వహించనుంది. వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్, మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీపై చర్చించనున్నారు.
- తెలంగాణలో నేటి నుంచి యాసంగి రైతుబంధు నిధులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరునుంది. రైతుల ఖాతాల్లో రూ.7645.66 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు రూ.50 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది.
- నేడు అర్హులై సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 18.47 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.703 కోట్ల నగదును ప్రభుత్వం జమచేయనుంది.
- హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000 లుగా ఉంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!