What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కొండపల్లిలోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ15, వైసీపీ14 స్థానాల్లో గెలుపొందింది. అయితే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా సాగడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది.
- ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు సీఎస్ సమీర్శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రోజు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
- శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెల చివరిలో ప్రారంభమయ్యాయి. అయితే నేడు 20వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.
- కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఈ నెల 23, 24, 25 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.
- నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ప్రో కబడ్డీ లీగ్ జరుగనుంది. అయితే ఈ సీజన్లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. కరోనా దృష్ట్యా ప్రేక్షకులకు అనుమతిని నిర్వాహకులు నిరాకరించారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్-యు ముంబాయి మధ్య జరుగనుంది. అలాగే తరువాతి మ్యాచ్ 8.30 గంటలు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ జట్టుల మధ్య పోరు జరుగనుంది. అనంతరం 9.30 గంటలకు బెంగాల్ వారియర్స్- యూపీ యోధ మధ్య మ్యాచ్ జరుగనుంది.
- నేడు నిర్మల్ జిల్లాలో వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర నిర్వహించనున్నారు. దిలావర్పూర్, సారంగాపూర్, మామడ మండలాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
- నేడు ఆర్థికవేత్తలతో నిర్మలాసీతారామన్ వర్చుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రీ బడ్జెట్పై ఆర్థికశాఖ మంత్రి నిర్మాలసీతారామన్ సంప్రదింపులు జరుపనున్నారు.
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,420లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,200లుగా ఉంది.
Also Read
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
తాజావార్తలు
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!