నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. 12 పురపాలక, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
వర్షాల ప్రభావంతో నేడు పలు రైళ్లు రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిన మధ్య రైల్వే శాఖ పేర్కొంది. విశాఖపట్నం-కడప (17488), తిరుపతి-భువనేశ్వర్ (22872)రైలు రద్దు, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), చెన్నై సెంట్రల్-బిలాస్పూర్ (12852), హౌరా-యశ్వంత్పూర్ (22863), హౌరా- చెన్నై సెంట్రల్ (12841), హౌరా-కన్యాకుమారి (12665), ధన్బాద్-అలప్పుజ (13351), ముజఫర్పూర్-యశ్వంత్పూర్ (15528) రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
విశాఖలో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్లతో కూడిన రైలును ప్రారంభించనున్నారు.
పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హజరుకానున్నారు. సీజేఐ ఎన్వీ రమణ ఉదయం 9గంటలకు సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం ఆయన స్నాతకోత్సవంలో పాల్గొంటారు. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయనున్నారు.
హైదరాబాద్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.70,400 లుగా ఉంది.
అంగరంగ వైభవంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ మహాక్రతువులో తుది ఘట్టం. నేడు భక్తులచే మహాదేవునికి కోటి రుద్రాక్షల అర్చన, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అనుగ్రహా భాషణం, శ్రీ నండూరి శ్రీనివాస్చే ప్రవచనామృతం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఎస్టీఆర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు.