ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ స్థానం ప్రత్యేకమైనది. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఎందరో మహానటులు తమదైన అభినయంతో అలరించారు. అలాంటి వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆ తరం మహానటుల్లో మిగిలివున్న ఏకైక నటుడు ఆయనే! అందుకే అందరూ దిలీప్ కుమార్ ను ‘ద లాస్ట్ థెస్సియన్’ అంటూ కీర్తిస్తారు. ఉత్తరాదిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ త్రిమూర్తులు జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో దక్షిణాదిన తెలుగులో యన్టీఆర్ – ఏయన్నార్, తమిళంలో ఎమ్జీఆర్ – శివాజీగణేశన్, కన్నడ నాట రాజ్ కుమార్, మళయాళ సీమలో ప్రేమ్ నజీర్ రాజ్యమేలారు. ఈ సూపర్ స్టార్స్ లో ఒకే ఒక్క ఎమ్జీఆర్ మాత్రమే దిలీప్ కంటే వయసులో పెద్దవారు. ఇక అందరూ దిలీప్ కంటే వయసులో చిన్నవారే!
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11న అవిభాజ్య భారతంలోని పెషావర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు దిలీప్. సినిమా రంగంలో అడుగుపెట్టాకే, యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్ గా మారారు. 1944లో బాంబే టాకీస్ నిర్మించిన ‘జ్వార్ బాటా’తో దిలీప్ కుమార్ చిత్రసీమలో ప్రవేశించారు. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రలను పోషిస్తూ సాగిన దిలీప్ కుమార్ “జోగన్, బాబుల్, దీదార్, దాగ్, దేవదాస్, నయాదౌర్, ఆన్, యాహుదీ, కోహినూర్, మొఘల్-ఏ-ఆజమ్, ఆజాద్,గంగ-జమున, రామ్ ఔర్ శ్యామ్, ఆద్మీ, గోపీ” వంటి చిత్రాలలో నటించి జనాన్ని అలరించారు. ముఖ్యంగా ఆయన నటించిన విషాద పాత్రలు దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపాయి. దిలీప్ మెథడ్ యాక్టర్ గానూ జేజేలు అందుకున్నారు. రాజ్ కపూర్ తో కలసి ‘అందాజ్’లో నటించిన దిలీప్, దేవానంద్ తో కలసి ‘ఇన్సానియత్’లో అభినయించారు. ఈ ‘ఇన్సానియత్’ తెలుగులో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’కు రీమేక్ కావడం విశేషం.
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
తనకంటే వయసులో 22 సంవత్సరాలు చిన్నదైన నటి సైరాబానును దిలీప్ వివాహమాడారు. 1981 చివరలో ఆస్మాసాహిబా అనే ఆమెను కూడా పెళ్ళాడారు. అయితే ఆ సమయంలో ఎంతోమంది దిలీప్ సన్నిహితులు సైతం సైరాబాను పక్షాన నిలిచారు. దాంతో 1983లో ఆస్మాకు విడాకులు ఇచ్చారు దిలీప్. ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఈ మహానటుణ్ణి గౌరవించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ దిలీప్ ను సన్మానించారు. 1997లో యన్టీఆర్ నేషనల్ అవార్డునూ దిలీప్ అందుకున్నారు. కళాకారుల విభాగంలో 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన దిలీప్ ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగారు.
తాజావార్తలు
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!