Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Vande Bharat Express Extended To Kasaragod

Vande Bharat Express: కాసర్‌గోడ్ వరకు వందే భారత్ పొడిగింపు.. టికెట్ ధర ఎంతంటే?

Published Date :April 18, 2023 , 8:13 pm
By NTV WebDesk
Vande Bharat Express: కాసర్‌గోడ్ వరకు వందే భారత్ పొడిగింపు.. టికెట్ ధర ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేరళ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్‌లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 25న కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభిస్తారు. సోమవారం ట్రయల్ రన్ సమయంలో, ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుండి ఉదయం 5:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు కన్నూర్ చేరుకుంది. 502 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 7 గంటల 10 నిమిషాల సమయం పట్టింది.

వందేభారత్ రైలు తిరువనంతపురం నుండి ఉదయం 5.10 గంటలకు బయలుదేరుతుంది. రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు కన్నూర్ చేరుకుంటుంది. కాసర్‌గోడ్‌కు సర్వీస్ ను పొడిగించినందున, సవరించిన టైమ్‌టేబుల్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. తిరువనంతపురం-కన్నూరు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో భోజనం కలిపి రూ. 2,400. తిరువనంతపురం-కన్నూరు ఎకానమీ కోచ్‌లో ఆహారంతో సహా రూ.1,400.గా నిర్ణయించారు. వందేభారత్‌లో ఒక్కొక్కటి 78 సీట్లతో 12 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి 54 సీట్లతో 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో కోచ్‌లో ముందు మరియు వెనుక 44 సీట్లు ఉంటాయి
Also Read:Siddaramaiah vs Somanna: బీజేపీ అభ్యర్థికి నిరసన సెగ.. అభివృద్ధిపై మంత్రికి చేదు అనుభవం

మరోవైపు రైలు వేగాన్ని పెంచేందుకు ట్రాక్‌లను సవరించనున్నారు. వివిధ ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 110 కి.మీ వేగం పెంచనున్నారు. రెండు దశల్లో ట్రాక్‌లను పునరుద్ధరిస్తారు. మొదటి దశను ఏడాదిన్నరలోగా పూర్తవుతుంది. మొదటి దశ తర్వాత రైలు గంటకు 110 కి.మీ.గా నిర్ణయించారు. మలుపులను సరిదిద్దడం, అవసరమైన ఇతర సర్దుబాట్లతో కూడిన రెండవ దశ పూర్తి కావడానికి రెండు నుండి మూడున్నర సంవత్సరాలు పడుతుంది. దీని తర్వాత రైలు వేగాన్ని 130 కి.మీ.కి పెంచుతారు. సిగ్నలింగ్ వ్యవస్థను సవరించి, వంపులు సరిచేయాలంటే భూసేకరణ అవసరం. కేరళ రైల్వే ట్రాక్‌పై 600 కంటే ఎక్కువ వంపులు ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ జిల్లాల్లో ఉన్నాయి.

సోమవారం ట్రయల్ రన్‌లో సగటు వేగం గంటకు 70 కి.మీ కంటే తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందని లోకో పైలట్ తెలిపారు. భారతదేశంలో అత్యంత వేగంగా పరిగెత్తే రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గత రెండేళ్లుగా దేశంలో సగటున 83 కి.మీ వేగంతో నడుస్తోంది. అయితే ట్రాక్ పరిస్థితులు సరిగా లేవు, వాణిజ్య సేవల కోసం గరిష్టంగా 130 కి.మీ. వేగంతో నడుస్తోందని RTI వెల్లడించింది.
Also Read:Siddaramaiah vs Somanna: బీజేపీ అభ్యర్థికి నిరసన సెగ.. అభివృద్ధిపై మంత్రికి చేదు అనుభవం

భవిష్యత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. అయితే, ఇది సంక్లిష్టమైన పని అని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ మాత్రమే కేటాయించామని, అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ రైళ్లు, మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. స్లీపర్ రైళ్లు 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు అనువైనవి మరియు మెట్రోలు 200 కి.మీ పరిధిలోని నగరాలను కలుపుతాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwini Vaishnaw
  • Kasaragod
  • Kerala
  • railway minister
  • Vande Bharat Express

తాజావార్తలు

  • Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం

  • Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి

  • Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!

  • Dhurandhar 2 : ధురంధర్‌ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి

  • UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions