NTV Telugu Site icon

యూపీ ఎన్నిక‌లు: కాంగ్రెస్ పార్టీ వ‌రాలు…

వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకురావాలి చూస్తున్న‌ది కాంగ్రెస్ పార్టీ.  రాష్ట్రంలో మ‌హిళ‌ల ఓట్లు ఎవ‌రికైతే ప‌డ‌తాయో వారు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది.  దీంతో కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ది.   వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అద‌నంగా మ‌రికోన్ని వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధిస్తే ఇంట‌ర్‌లో ఉత్తీర్ణులైన బాలిక‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తామ‌ని, అదే విధంగా గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న యువ‌తుల‌కు ఉచితంగా స్కూటీలు ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ప్ర‌క‌టించారు.  తామేమి ఉత్త మాట‌లు చెప్ప‌డం లేద‌ని, పార్టీ మ్యానిఫెస్టో ఆమోదం మేర‌కు తాము ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తున్నామ‌ని ప్రియాంక గాంధీ తెలిపారు.  విద్యార్థునుల భ‌ద్ర‌త ముఖ్య‌మ‌ని అందుకు స్మార్ట్‌ఫోన్లు అందించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్రియాంక గాంధీ తెలిపారు.  ఈ విష‌యాల‌ను ప్రియాంక గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు.  

Read: మాస్క్ ధ‌రించ‌కుంటే ఇక‌పై భారీ జ‌రిమానా…