మరోసారి చైర్మన్గా అవకాశం.. సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పిన బాబాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ బోర్డు చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
టీటీడీలో గతంలో చేయకుండా మిగిలిన కార్యక్రమాలకు తోడుగా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి… ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్లో టీటీడీ ఎలాంటి వివక్ష చూపలేదన్న ఆయన.. బోర్డు సభ్యుల నియామకంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఒత్తిళ్లకు లొంగని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి… సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించామని గుర్తు చేసుకున్నారు.. అయితే, కోవిడ్ నేపథ్యంలో కొన్ని పనులు చేయలేకపోయాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!