NTV Telugu Site icon

TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..

Lahari Buses

Lahari Buses

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ ఫీచర్లతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించనుంది. మొదటి దశలో 16 ఏసీ స్లీపర్ బస్సులను వినియోగంలోకి తెస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై రూట్లలో నడపనుంది. ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ ఎల్ బీ నగర్ లో విజయవాడ రూట్ లో జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.
Also Read: Boxing : భారత్ కు మరో రెండు స్వర్ణాలు.. నిఖత్, లవ్లీనా జోరు

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీ ఇటీవలే కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులు, 8 నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, 4 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో నాన్-ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే, ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభవం’ అని నామకరణం చేశారు.

తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఏసీ స్లీపర్ బస్సులకు సరికొత్త సాంకేతికతను జోడించామని టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ సౌకర్యం కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్‌టీసీ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తారు. ప్రయాణీకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కడం ద్వారా TSRTC కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించబడుతుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు స్పందించి త్వరగా చర్యలు తీసుకుంటారు. 12 మీటర్ల పొడవున్న AC స్లీపర్ బస్సులు 30 బెర్త్‌ల సామర్థ్యం ఉంది. దిగువ 15, ఎగువ 15 బెర్త్‌ల వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు వాటర్ బాటిల్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా ఉంది.
Also Read:Hyper Aadi: మెగాస్టార్ వెంట్రుక కూడా పీకలేరు.. వారికి ఆది వార్నింగ్

గమ్యస్థానాల వివరాలను చూపించడానికి బస్సు ముందు, వెనుక భాగంలో LED డిస్ప్లే బోర్డులు ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం, బస్సులలో భద్రతా కెమెరాలను అమర్చారు. ప్రతి బస్సులో రివర్స్ పార్కింగ్ సహాయ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునిక ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్ (FDAS) వ్యవస్థాపించబడింది. బస్సులో మంటలు చెలరేగినప్పుడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది.

ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్‌ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్‌ ధరలను తగ్గించనున్నారు.