NTV Telugu Site icon

మహాధర్నా అనంతరం టీఆర్‌ఎస్ పాదయాత్ర..

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత సహా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్‌ఎస్‌ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం మీదుగా రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరాపార్క్‌లో మహాధర్నా కొనసాగనుంది. ప్రస్తుతం పలువురు నేతలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు.