Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trs Going With Welfare Schemes In Huzurabad

సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్‌ఎస్‌…

Published Date :September 24, 2021 , 4:53 pm
By Manohar
సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్‌ఎస్‌…
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచార వేగం పెరింది. దాంతో పాటే హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రచార బృందానిక సారధ్యం వహిస్తున్న మంత్రి టి. హరీష్‌ రావు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏకరవు పెడుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధనాలను ఎండగడుతున్నారు. అంతేకాదు సరికొత్త హామీలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఐదు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది టీఆర్‌ఎస్‌. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు మంజూరయ్యాయి. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉండి కూడా ఓక్కంటే ఒక్క ఇల్లు కూడా కట్టించలేకపోయారు. అదే సమయంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు మంత్రి హరీష్‌ రావు.

హుజూరాబాద్‌కు ఐదు వేల ఇండ్లు మంజూరు చేయటమే కాదు వాటిని కట్టి చూపిస్తుంది. ఇల్లందకుంట మండలంలో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల లోన్‌ ఇంట్రెస్ట్‌ సొమ్ము 3 కోట్ల 14 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోంది. అందుకే ఏ పార్టీని బలపరచాలో ప్రజలే నిర్ణయించుకోవాల్సి వుంది. గతంలో హామీ ఇచ్చిన విధంగా 25 వేల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. అలాగే 50 వేల రూపాయల లోపు రుణాలను పది రోజులలో మాఫీ అవుతాయి. ఇక లక్ష లోపు రుణాలను ఫిబ్రవరి, మార్చి మధ్య మాఫీ ఖాయం. కరోనా మహమ్మారి కారణంగా తలెల్తిన ఆర్థిక సంక్షోభం మూలంగా రైతు రుణ మాఫీ ఆలస్యమైంది.

రుణ మాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమాతో ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది. అయితే కేంద్రం మాత్రం డీజిల్‌ ,పెట్రోల్ ధరలు పెంచుతూ వారి నుంచి డబ్బులు పిండుకుంటోంది. అన్నిటిని మించి నూతన వ్యవసాయ చట్టాల ద్వారా మార్కెట్‌ యార్డులను కేంద్రం రద్దు చేసే ఆలోచనలో ఉంది. 450 రూపాయలున్న వంట గ్యాస్‌ ధరని మోడీ సర్కార్‌ వెయ్యి రూపాయలు చేసింది. 250 రూపాయలుండే గ్యాస్‌ సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించింది. కానీ బీజేపీ నేతలు వీటిని ప్రస్తావించకుండా హుజూరాబాద్‌ ఓటర్లకు గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు పంచుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, వంటగ్యాస్‌, వంట నూనెల ధరలు తగ్గిస్తామని ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించారు హరీష్‌ రావు.

పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ 17 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి..ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఆ పథకాలను పల్లీలతో పోల్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తుండగా బీజేపీ పాలనలోని గుజరాత్‌ కేవలం 600 రూపాయలు ఇస్తోంది. రాబోవు రోజుల్లో 57 ఏళ్లు దాటిన వారికి కూడా పెన్షన్‌ పొందనున్నారు. నల్లా కనెక్షన్లు ఇచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చింది తెలంగాణ ప్రభుత్వం. మిషన్‌ భగీరథ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తోంది. అలాగే కలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో యాసంగికి కూడా కావాల్సినంత సాగు నీరు ఇస్తోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తోంది. మరోవైపు కేంద్రం రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించాలని చూస్తోంది. అందుకే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడించి గట్టిగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు మంత్రి హరీష్ రావు. మరి ఆయన మాటలు హుజూరాబాద్‌ ఓటర్లను ఏమేరకు ఆకట్టుకుంటాయో ఎన్నికల తరువాత కానీ తెలియదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • huzurabad
  • Huzurabad by-election
  • karimnagar
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Off The Record : అరవ శ్రీధర్ కు జనసేన క్లీన్ చిట్ ఇచ్చేసిందా..?

  • Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.

  • Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

  • Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!

  • Off The Record : డేంజర్ జోన్ లో అజారుద్దీన్ మంత్రి పదవి..?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions