NTV Telugu Site icon

వినాయక నిమజ్జనం.. 24 గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు పోలీసులు. ఇక, శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధం విధించారు.. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లించారు అధికారులు..

విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.. నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకుంటే.. 040-27852482, 94905 98985, 90103 03626 నెంబర్లకు సంప్రదించవచ్చునని పోలీసులు వెల్లడించారు.. ఇక, గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు..

గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర ఇలా..

అయితే, ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని సూచిస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు.. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు..