Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Third Wave Of Covid Hits Nagpur

నాగపూర్‌లోకి థర్డ్‌ వేవ్‌ ఎంటర్‌..

Published Date :September 7, 2021 , 3:19 pm
By Manohar
నాగపూర్‌లోకి థర్డ్‌ వేవ్‌ ఎంటర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓ పక్క కేసులు తగ్గాయన్న సంతోషం… మరోవైపు థర్డ్‌ వేవ్‌ మొదలైందన్న ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్స్‌లో ఉన్నాం. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. అయితే ఇదే సమయంలో దేశంలో థర్డ్‌ వేవ్‌ పాదం మోపటం ఓ హెచ్చరిక లాంటిది. అదే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

థర్డ్ వేవ్‌ నాగ్‌పూర్ ని తాకిందని మహారష్ట్ర మంత్రి స్వయంగా తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్లు నగరానికి చేరాయని , త్వరలో సిటీలో కోవిడ్‌ 19 నిబంధనలు తిరిగి అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎనర్జీ మంత్రి నితిన్‌ రౌత్‌ చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. రెవెన్యూ, పోలీస్‌, హెల్త్‌ విభాగాలకు చెందిన సీనియర్‌ సీనియర్‌ అధికారులతో జరిగిన రివ్వూ మీటింగ్‌ అనంతరం మంత్రి ఈ విషయం చెప్పారు. అంటే అధికారులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తోనే ఈ ప్రకటన చేశారు. కాబట్టి దానిని అంత సులభంగా కొట్టిపారేయలేము. ఆదివారం పది కేసులు, సోమవారం 13 కేసులు నమోదు కావటాన్ని మంత్రి గుర్తుచేశారు. నగరంలోకి కోవిడ్‌ 19 అడుగుపెట్టిందనటానికి ఇదే నిదర్శనమన్నారాయన.

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

గత కొన్ని రోజుల నుంచి నిపుణులు కూడా థర్డ్ వేవ్‌ హెచ్చరికలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మొదలై ఆక్టోబర్‌లో గరిష్టానికి చేరుతుందని అంచనా. మహారాష్ట్ర మంత్రి చెప్పిన దాని ప్రకారం థర్డ్‌ వేవ్‌ మొదలైందనే అనుకోవాల్సి వుంటుంది. అంటే ఇప్పుడు మనం థర్డ్ వేవ్‌లో ఉన్నట్టే లెక్క. ఆగస్టు నెలలోనాగపూర్‌ జిల్లాలో కొత్తగా 145 కేసులు రిజిస్టరయ్యాయి. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు 42 మంది కోవిడ్‌ 19 బారినపడ్డారు. ఒకరు చనిపోయారు.

దేశ వ్యాప్తంగా 31 వేల 222 కొత్త కేసులు బయటపడ్డాయి. 290 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,41,042 మందిని మహమ్మారి బలితీసుకుంది. కేరళలోనూ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆ రాష్ట్రంలో 19 వేల 688 కేసులు, 135 మరణాలు రిజిస్టరయ్యాయి. ఇక కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య మరోసారి 4లక్షల దిగువకు పడిపోయింది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నాన్‌ స్టాప్ గా నడుస్తోంది. సోమవారం కోటీ 13 లక్షల మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో కోటి మందికి పైగా డోస్‌ ఇవ్వటి ఇది రెండో సారి. ఇప్పటివరకు దాదాపు 70 కోట్ల డోసుల పంపిణీ జరిగింది.

దేశంలో ఆగస్టు నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని.. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠానికి చేరుకోవచ్చని ఇలీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ల స్టడీ ప్రకారం రెండో దశ కంటే దీని తీవ్రత తక్కువగానే ఉండొంచ్చు. మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. మూడో దశ వ్యాప్తి పీక్‌లో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని.. పరిస్థితులు మరింత దిగజారితే 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా .

ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ విధ్వంసం మొదలైంది. ఆసమయానికి దేశ రాజధాని ఢిల్లీ సహా దేశ వ్యప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సీజన్ కొరత నెలకొంది. ఫలితంగా వేలాది మంది ప్రాణాలు పోయాయి. కేవలం సెకండ్‌ వేవ్‌ కు ప్రిపేర్‌గా లేకపోవటమే ఆ చావులకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా కూడా భారత్‌ ప్రతిష్ట దెబ్బతింది. ఇంటర్నేషనల్‌ మీడియా మోడీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూడటం అందరి బాధ్యత.

సెప్టెంబర్ నుంచి నవంబర్‌ వరకు పండగల సీజన్‌. అదే అందరినీ కలవరపెడుతోంది. కొత్త వేరియంట్లకు చాలా అవకాశం ఉంది. మరి ఆస్పత్రులు అందుకు సిద్ధంగా ఉన్నాయా? ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల సన్నధ్దత చాలా ముఖ్యం ఇప్పుడు. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్‌ హాస్పటల్స్‌ కూడా ఈ క్లిష్ట సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. బెడ్స్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తగా ఆక్సిజన్‌ అందుబాటు పెరిగినట్టు సమాచారం. 100గా ఉన్న ఆక్సీజన్‌ కెరీర్ల సంఖ్య ఇప్పుడు 1, 250కి పెరిగింది. లిండే వంటి కంపెనీలు గ్యాస్‌ ఉత్పత్తి ని 50 శాతం పెంచాయి. దీని వల్ల రోజుకు 15 వేల టన్నుల ఆక్సీజన్‌ అందుబాటులోకి వస్తుంది.

కొత్త మ్యుటేషన్ల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండొచ్చంటున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని రష్ట్రాలు ప్రత్యేక పేడియాట్రిక్‌ వార్డులను రెడీ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ముందస్తుగా రెమిడిస్‌విర్‌ వంటి యాంటీ వైరస్‌ మెడిసిన్స్‌ స్టాక్‌ పెట్టుకుంటున్నాయి.

మరోవైపు, దేశంలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్‌ని ఎదిరించే యాంటీబాడీస్‌ అభివృద్ధి అయ్యాయని ప్రభుత్వ నివేదికలు అంటున్నాయి. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పటి వరకు కనీసం 57 శాతం మంది ఒక్క డోసు వ్యాక్సిన్‌ అయినా తీసుకుని ఉన్నారు. అందుకే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ ప్రభావం తక్కువగా ఉండొచ్చన్న నిర్ధారణకు వచ్చారు వైరాలజిస్టులు. అయితే ఎవరెన్ని చెప్పినా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటేనే ఈ గండం నుంచి గట్టెక్కగలం!!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • Covid 19
  • Covid Third Wave
  • Maharashtra
  • Nagpur

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions