టీఆర్ఎస్ సన్నాహాలు అందుకేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను టీఆర్ఎస్ నియమించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కూడా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం కూడా హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చే నెలలో వరంగల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానంటూ.. గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా.
అయితే ఇటీవల ఎన్నుకున్న గ్రామ కమిటీలు, మండల కమిటీలలో పదవి ఆశించి భంగపడ్డ నేతలు అసంతప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ కు లీడర్ కు మధ్య సంత్సబంధాలు ఉండేలా చేసేందుకు భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా రానున్న 2023-24 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే రంగం సిద్దం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామ కమిటీలు టీఆర్ఎస్ పార్టీకి పునాదులు అంటూ కేసీఆర్ పలు మార్లు ప్రసంగించారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
అయితే ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విముఖత ఉందని నివేదకలు రావడంతో.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పావులు కదుపుతున్నారా..? అనే ప్రశ్న పలువురు రాజకీయ నేతల మనుసులో ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. కార్యకర్తలు కూడా నూతనోత్సాహంతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు, సమావేశాలకు హజరవుతున్నారు.
రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైననాటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తూ.. తన నియామకంపై విముఖతతో ఉన్న వారిని మచ్చిక చేసుకుంటున్నారు. రేవంత్ నియామకంతో టీఆర్ఎస్లోకి వెళ్లి అసంతృప్తితో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలు కూడా తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరైతే ఇప్పటికే చేరిపోయారు. దీనితో పాటు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం కావడంతో బీజేపీ కార్యక్రమాల్లో మార్పు వచ్చింది.
బండి సంజయ్ నియామకమైన తరువాత రాష్ట్రంలో బీజీపీ పుంజుకుంది అనే వాదనకు ఇటీవల జీహెచ్ఎంసీ ఫలితాలే సాక్ష్యం. దీంతో మళ్లీ ప్రతిపక్షం పుంజుకోకుండా ఉండేందుకు కార్యకర్తల్లో నమ్మకం నింపేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారా..? అని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ కు మాంచి గ్రిప్ ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రానున్న ఎన్నికల్లో గెలుపే సంకల్పంగా టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందా..? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!