30 రోజులు.. 3 లక్షల కోట్ల వ్యాపారం.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్యాణం కమనీయం అంటారు. కానీ మనదేశంలో పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయాయి. మూడు ముళ్ళు, ఏడడుగులు వేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందేనా? లక్షల కోట్లు ఆవిరి కావాల్సిందేనా? అంటే అవునంటున్నారు వ్యాపారులు. మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి కానీ లేకుంటే అంగరంగ వైభవంగా పెళ్ళితంతు జరగాల్సిందే. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
ఈ ఏడాది 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ మధ్యకాలంలో మంచి ముహూర్తాలు వున్నాయి. దీంతో వివాహాలు భారీగా జరగనున్నాయని తెలుస్తోంది. దాదాపుగా 25 లక్షల వివాహాలు ఈ శుభముహూర్తాన జరగనున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అధ్యయనంతో తేలింది. అంటే ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెడతారో అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్ళి తంతు ఖర్చు తక్కువేం కాదు. అక్షరాలా 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
Also Read
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!

కేవలం దేశరాజధాని ఢిల్లీలోనే 1.5 లక్షల పెళ్ళిళ్ళకు భాజాభజంత్రలు మోగనున్నాయి. ఇందుకోసం 50వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా కారణంగా లక్షలాది పెళ్ళిళ్ళు గత ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చాయి. పెళ్ళిళ్ళకు అతిథుల రాకపై తీవ్రమయిన ఆంక్షలు అమలయ్యాయి. 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతి లభించేది.
దీంతో పెద్ద కుటుంబాల వారు అంత సింపుల్గా పెళ్ళిళ్ళు చేయలేక వాయిదా వేశారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకూ జరిగే పెళ్ళిళ్ళతో కల్యాణ మంటపాలు, హోటళ్ళు, ఓపెన్ లాన్స్, బ్యాంకెట్ హాల్స్, ఫాంహౌస్లు సందడిగా మారనున్నాయి. పెళ్ళిళ్ళపై ఆధారపడ్డ అనేక సంస్థలు, క్యాటరింగ్ సంస్థలకు వ్యాపారం రానుంది. అనేక రాష్ట్రాలు 250 మంది వరకూ పెళ్ళిళ్ళకు అనుమతి ఇస్తున్నాయి.
ఢిల్లీలో 200 మంది అతిథులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ముంబై, ఎన్సీఆర్, రాజస్థాన్ ప్రాంతాల్లో వివిధ ఫంక్షన్ హాళ్ళలో 50 శాతం కెపాసిటీ, 200మంది వరకూ అతిథుల్ని అనుమతిస్తున్నాయి. ఆతిథ్య సంస్థలు భారీ వివాహాలతో వేల కోట్ల టర్నోవర్ సాధించనున్నాయి. ఈ పెళ్ళిళ్ళ కారణంగా క్యాటరింగ్ సంస్థల పంట పండనుంది. అసలే పెళ్ళి అంటే ఆ తంతు, ఆ ఆర్భాటం, హంగామా మామూలుగా వుండదు.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!