30 రోజులు.. 3 లక్షల కోట్ల వ్యాపారం.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్యాణం కమనీయం అంటారు. కానీ మనదేశంలో పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయాయి. మూడు ముళ్ళు, ఏడడుగులు వేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందేనా? లక్షల కోట్లు ఆవిరి కావాల్సిందేనా? అంటే అవునంటున్నారు వ్యాపారులు. మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి కానీ లేకుంటే అంగరంగ వైభవంగా పెళ్ళితంతు జరగాల్సిందే. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
ఈ ఏడాది 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ మధ్యకాలంలో మంచి ముహూర్తాలు వున్నాయి. దీంతో వివాహాలు భారీగా జరగనున్నాయని తెలుస్తోంది. దాదాపుగా 25 లక్షల వివాహాలు ఈ శుభముహూర్తాన జరగనున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అధ్యయనంతో తేలింది. అంటే ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెడతారో అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్ళి తంతు ఖర్చు తక్కువేం కాదు. అక్షరాలా 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేవలం దేశరాజధాని ఢిల్లీలోనే 1.5 లక్షల పెళ్ళిళ్ళకు భాజాభజంత్రలు మోగనున్నాయి. ఇందుకోసం 50వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరోనా కారణంగా లక్షలాది పెళ్ళిళ్ళు గత ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చాయి. పెళ్ళిళ్ళకు అతిథుల రాకపై తీవ్రమయిన ఆంక్షలు అమలయ్యాయి. 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతి లభించేది.
దీంతో పెద్ద కుటుంబాల వారు అంత సింపుల్గా పెళ్ళిళ్ళు చేయలేక వాయిదా వేశారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకూ జరిగే పెళ్ళిళ్ళతో కల్యాణ మంటపాలు, హోటళ్ళు, ఓపెన్ లాన్స్, బ్యాంకెట్ హాల్స్, ఫాంహౌస్లు సందడిగా మారనున్నాయి. పెళ్ళిళ్ళపై ఆధారపడ్డ అనేక సంస్థలు, క్యాటరింగ్ సంస్థలకు వ్యాపారం రానుంది. అనేక రాష్ట్రాలు 250 మంది వరకూ పెళ్ళిళ్ళకు అనుమతి ఇస్తున్నాయి.
ఢిల్లీలో 200 మంది అతిథులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. ముంబై, ఎన్సీఆర్, రాజస్థాన్ ప్రాంతాల్లో వివిధ ఫంక్షన్ హాళ్ళలో 50 శాతం కెపాసిటీ, 200మంది వరకూ అతిథుల్ని అనుమతిస్తున్నాయి. ఆతిథ్య సంస్థలు భారీ వివాహాలతో వేల కోట్ల టర్నోవర్ సాధించనున్నాయి. ఈ పెళ్ళిళ్ళ కారణంగా క్యాటరింగ్ సంస్థల పంట పండనుంది. అసలే పెళ్ళి అంటే ఆ తంతు, ఆ ఆర్భాటం, హంగామా మామూలుగా వుండదు.
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?