కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్ తో ఈ బృందం సమావేశమైంది. ఈ సమావేశం లో మంత్రి కేటీఆర్ తో పాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు, కేంద్ర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటతో ఎంత ధాన్యం ? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ భేటీ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.