Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Excise Minister Srinivas Goud Warning To Pub Owners

Srinivas Goud: డ్రగ్స్ దందా చేయాలనుకుంటే దేశం వీడండి.. పబ్స్ లేకుండా చేస్తాం..!

NTV Telugu Twitter
Published Date :April 9, 2022 , 1:35 pm
By Sudhakar Ravula
Srinivas Goud: డ్రగ్స్ దందా చేయాలనుకుంటే దేశం వీడండి.. పబ్స్ లేకుండా చేస్తాం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో తరచూ డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉన్నాయి.. తాజాగా ఓ పంబ్‌ వ్యవహారం రచ్చగా మారింది.. పలువురు ప్రముఖుల పిల్లలను తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, ఇవాళ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పబ్ నిర్వాహకులతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పబ్‌ నిర్వాహకులకు వార్నింగ్‌ ఇచ్చారు శ్రీనివాస్‌ గౌడ్.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు డబ్బు ముఖ్యం కాదు.. అవసరం అయితే మొత్తం పబ్‌లే బంద్‌ చేపిస్తామంటూ స్పష్టం చేశారు.

Read Also: Talasani: గవర్నర్ వ్యవస్థపై తలసాని సంచలన వ్యాఖ్యలు.. అసలు అవసరమా..?

రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.. రాష్ట్రంలో 40 శాతం భాగం హైదరాబాద్ ఉంది… డబ్బులకు ఆశపడి కొన్ని చీడపురుగులు అసాంఘిక పనులు చేస్తున్నాయి… వీటిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. పేకాట, గుడుంబాని అరికట్టాం.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. పబ్‌ల నిర్వహణ వెనుక ఎవ్వరు ఉన్న ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.. సొంత పార్టీ నేతలు ఉన్న వదిలి పెట్టకూడదు అని సీఎం ఆదేశించారు.. మా డిపార్ట్‌మెంట్‌ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉందన్నారు. మా అధికారులు మఫ్టీలో ఉంటూ అన్నింటిని పరిశీలిస్తున్నారు… గాంజాకి సంబంధించిన ఎన్నో కేసుల్ని ఎక్సైజ్ శాఖ చేధించిందని.. ఇప్పటికే పబ్ నిర్వాహకులకు చెప్పిన తర్వాత కూడా మళ్లీ డ్రగ్స్ దొరికాయి.. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న వారు ఎవరైనా ఇటువంటివి చేస్తే మానుకోండి… ఈ దందా చేయాలనుకునే వారు దేశంలో ఉండకండి.. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది, మీ లాంటి వారి కోసం కాదు.. చర్యలని ముమ్మరం చేస్తున్నాం, ఈ దందాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మా దగ్గర డౌట్ ఉన్న వారి లిస్ట్ ఉంది.. వారిపై నిఘా పెట్టాం.. పబ్‌లో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతాం.. చట్టాన్ని ఉపయోగించి అవసరం అయితే నగర బహిష్కరణ చేస్తాం అంటూ సీరియస్‌గా హెచ్చరించారు.

డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్లు దేశం విడిచి వెళ్లండి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. ఇక్కడ ఇటువంటి దందా చేస్తామంటే చూస్తూ ఉరుకోబోమన్న ఆయన.. రాష్ట్ర సర్కార్ కు డబ్బు ముఖ్యం కాదు… అవసరం అయితే మొత్తం బంద్ చేస్తామన్నారు.. అవసరం అయితే పబ్స్ లేకుండా కూడా చేస్తాం.. డబ్బే ప్రధానంగా ఈ దందా చేయాలనుకుంటే వారిని వదిలి పెట్టం అన్నారు.. పోలీసు, ఎక్సైజ్ శాఖ సహకారంతో చర్యలను ముమ్మరం చేస్తున్నాం.. మీరు ఇలానే చేస్తే నగరంలో పూర్తిగా పబ్స్ లేకుండా అవుతాయన్నారు.. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిపించుకోండి.. 24 గంటల పర్మిషన్ ఉన్న వాటిలో కేవలం సర్వీస్ మాత్రమే చేయాలన్నారు.. ఇక, సీసీ కెమెరాలను ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కి అటాచ్ చేస్తాం.. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే దాని ఏరియా అధికారులు చూడాలి, దీనికి బాధ్యులు ఏరియా సీఐ, ఎస్సైగా తెలిపారు.. సౌండ్స్ కూడా పరిమితికి లోబడి ఉండాలి… దీనిపై ఫిర్యాదులు వస్తే దాన్ని తొలగిస్తామని తెలిపారు. ఇక, మొన్న జరిగిన ఘటనలో కేవలం అనుమానితులని మాత్రమే పట్టుకున్నాం… ఎవ్వరినీ కావాలని అరెస్ట్‌ చేయలేదన్న ఆయన.. పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఇటువంటి చర్యలకు బాధ్యులు అని తెలిస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ చేసేవారిపై కూడా నిఘా పెట్టినట్టు వెల్లడించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drugs
  • Excise Minister Srinivas goud
  • Pub
  • pub owners
  • telangana

తాజావార్తలు

  • Ahmedabad Plane Crash: 274కు చేరిన ఎయిరిండియా మృతుల సంఖ్య

  • Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..

  • Borugadda Anil: జైలు నుంచి విడుదలైన బోరుగడ్డ అనిల్‌..

  • Gaddar Film Awards: నేడే గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

  • Maoist: ఏవోబీలో కీలక మావోయిస్టు నేతల అరెస్ట్..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions