Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Delegation Met Central Minister Piyush Goyal

ఎటూ తేల్చని కేంద్రం.. ఆందోళనలో రైతాంగం

Published Date :November 24, 2021 , 7:18 am
By NTV WebDesk
ఎటూ తేల్చని కేంద్రం.. ఆందోళనలో రైతాంగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం.

రాష్ట్రం నుంచి 3 మంత్రులు, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు సహా 10 మంది ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వ్యవసాయ. పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం చర్చల్లో పాల్గొంది. ఈ నెల 26 వ తేదీన సమావేశమౌతామని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే సాగయిన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయం పై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయం సంబంధిత అంశాలపై పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఆధర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు , కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

Also Read

  • Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

సీఎం కేపీఆర్ ఆదేశాలమేరకు మంత్రి కెటిఆర్ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత ఎంపీ కె.కేశవరావు, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు.. సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డిలతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్ రావు లతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చింది. తెలంగాణ వరిసాగు విస్తీర్ణం మీద కేంద్రం ఒక స్పష్టతకు వచ్చింది. 62 లక్షల 13 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిధాన్యాన్ని సాగుచేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అయినా ఎంత వరిధాన్యాన్ని కొనే అంశాన్ని కేంద్రం పెండింగులో పెట్టింది. ఈనెల 26వ తేదీన మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మరోసారి సమావేశం కానున్నారు.

ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయ పడింది. మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సీఎం కేసిఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇకనుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్ఠం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture minister
  • cm kcr
  • ktr
  • ktr team
  • Modi govt

తాజావార్తలు

  • Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్

  • Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!

  • Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!

  • Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు

  • Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions