Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Treason Cases On Journalists

తెలకపల్లి రవి : మీడియా, రాజద్రోహం, సుప్రీం కోర్టు తీర్పు

Published Date :June 5, 2021 , 7:35 pm
By Lakshmi Narayana
తెలకపల్లి రవి : మీడియా, రాజద్రోహం, సుప్రీం కోర్టు తీర్పు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా కట్టడిలో వైఫల్యం వంటివాటిని సూటిగా విమర్శించినందుకే వినోద్‌దువాపై ఈ సెక్షన్‌ బనాయించారు.పద్మశ్రీపురస్కార గ్రహీత అయిన వినోద్‌ యు ట్యూబ్‌ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై శ్యాం అనే బిజెపి నాయకుడు సిమ్లాజిల్లాలో కేసు పెట్టారు. ప్రభుత్వాలు తమతో ఏకీభవించిన జర్నలిస్టులపైన మీడియా ప్రసారాల పైన కేసులు పెట్టి వేధించడంపరిపాటి అయిందని వినోద్‌ దువా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ కేసును విచారించిన జస్టిస్‌ యుయు లలిత్‌ ధర్మాసనం జర్నలిస్టుల స్వేచ్చకు రక్షణ వుంటుందని ప్రకటించింది. హింసను ప్రేరేపించడం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానిన పడగొట్టాలని ప్రయత్నించడం మాత్రమే రాజద్రోహమని1962లో కేదార్‌నాథ్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం పాత్రికేయులందరికీ రక్షణ వుండాల్సిందేనని ప్రకటించింది, 2020 మార్చినాటి పరిస్థితుల్లో వలస కార్మికుల దుస్థితి వాస్తవమనీ వాటిపట్ల వ్యాకులతతో ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలిన వినోద్‌ దువా కోరడం ఏ విధంగానూ తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే తెలుగు ఛానళ్లుదాఖలు చేసిన పిటిషన్‌లోనూ సుప్రీం కోర్టు 124(ఎ)ను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం వుందని తెల్పింది.దీంతోపాటే భారత శిక్షాసృతి(ఐపిసి) సెక్షన153(ఎ) వివిధ తరగతుల ప్రజల మధ్య వైషమ్య వ్యాప్తి, 505 ప్రజాజీవితంలో కల్లోలసృష్టి అనే నిబంధనలను కూడా మీడియా కోణంలో మళ్లీ పరిశీలించాల్సి వుందని చెప్పింది.

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

ఈ ఏడాది ఏప్రిల్‌ 30న న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పులో కరోనా నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను మీడియాలో నివేదించినందుకు విమర్శించినందుకు కేసులు బనాయించడం సరికాదని కోర్టు చెప్పింది,1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్‌ చట్టం ఇవన్నీ పరాయి ప్రభుత్వం దేశ ప్రజలస్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చినవే.వాటినే ఐపిసి124(ఎ) ఆ అంశాలకే ప్రతిరూపం, వాటిని ఇంకా కొనసాగిస్తూ ఇప్పుడుసోషల్‌ మీడియాపైనా అదే దాడి చూస్తున్నాం. ఐపిసి124(ఎ)లో ఏం వుంది?:ఎవరైనా సరే తమ మాటల ద్వారా గాని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా సంజ్ఞలు లేదా ప్రత్యక్ష వ్యక్తీకరణల ద్వారా గాని మరో విధంగా గాని విద్వేషంలేదా ధిక్కారం వ్యాప్తి చేసేట్టయితే భారత దేశంలో చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అయిష్టతను విముఖతను రెచ్చగొట్టేట్టయితే ప్రేరేపించేట్టయితే వారికి కారాగారశిక్షకు పాత్రులగుదురు’ ఈ కారాగారశిక్ష మూడేళ్ల నుంచియావజ్జీవం వరకూ వుండొచ్చు.

రెండూ కలిసి కూడా వుండొచ్చు. ప్రభుత్వ విధానాలను చట్టంద్వారా మార్చడానికి ప్రయత్నిస్తే అది రాజద్రోహం కాదు.ద్వేషం ధిక్కారం ప్రేరేపించే వ్యాఖ్యలు కూడా రాజద్రోహం కాదని వివరణలు,చెబుతున్నాయి. కాేని ఆచరణలో మాత్రం దీన్నివిచక్షణా రహితంగా ప్రయోగిస్తూనే వున్నారు. ఉదాహరణకు ,కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ యుపిలోని హత్రాస్‌లోదళిత బాలిక అత్యాచారానికి గురైన దారుణఘటనకు సంబంధించి వివరాల సేకరణ కోసం వెళితే ఈ కేసు పెట్టారు రైతుల ఆందోళనను బలపర్చినందుకు గాను బెంగుళూరులోదిశారవి అనే పర్యావరణ కార్యకర్తపైన 124 ఎ మోపారు.ఇదే ఆందోళనకు సంబంధించి రిపబ్లిక్‌ దినోత్సవంనాడు జరిగిన ఘటనల వెనక వాస్తవాలు వెల్లడిరచినందుకు గాను రాజ్‌దీప్‌ సర్దేశాయి, వినోద్‌జోష్‌, జఫర్‌ఆఘా, పరేశ్‌నాథ్‌,అనంతనాథ్‌ తదితరులపై రాజద్రోహం కేసులే పెట్టారు, సుప్రీం కోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాల్సివచ్చింది,

2014లో 47,2015లో 30,2016లో 35,2015లో 51,2018 లో 70,2019లో 93 రాజద్రోహం కేసులు నమోదవడం, సంబంధిత వ్యక్తులు విచారణ లేకుండా ఖైదులో మగ్గిపోవడం వేధింపులకు గురవడం జరుగుతున్నది.కాని అంతిమంగా శిక్షలు పడే శాతం చాలా నామమాత్రం, 2016,17లలో లో ఒక్కొక్కరిక,2018లోఇద్దరిక,2019లోముగ్గురికి మాత్రమే విచారణలో నేర నిర్దారణ జరిగింది, అదైనా ఏ మేరకు ఏ పద్దతిలో జరిగిందనేది పరిశీలించవలసిందే, ఒక్క యుపిలోనే హత్రాస్‌ ఘటన తర్వాత సిద్దిక్‌ కప్పన్‌తో పాటు మొత్తం 22 మందిపై 124(ఎ) కింద కేసులు పెట్టారు.దీంతోపాటే మణిపూర్‌ వంటిచోట్ల జాతీయ భద్రతా చట్టం(నాసా)ను కూడా ప్రయోగించారు, వాస్తవానికి ప్రభుత్వ వైఖరితో విబేదించినంతమాత్రాన రాజద్రోహం అనడం సరికాదని 2018లో లాకమిషన్‌ స్వయంగా వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాపితంగా అత్యధిక దేశాలు ఈ రాజద్రోహం వంటి నిబంధనలకు స్వస్తిచెప్పేశాయి.

మారిన పరిస్తితులలో తమ కోణంలో దేశభద్రత టెర్రరిజం నిరోధం వంటి చట్టాలు చేసుకున్నాయి,మన దేశంలో నాసా,ఉసా వంటి చట్ట్లాలు ఆ విధంగా చేసినవే అయినా వాటినీ విపరీతంగా దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ సమయంలో భీమ్‌ కోర్‌గావ్‌ కుట్ర పేరిట వయోవృద్ధులైన వరవరరావు స్టాన్‌స్వామి వికలాంగుడైనప్రొఫెసర్‌ సాయిబాబ, పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఖైదులో మగ్గిపోతున్నారు. పౌరులకు రాజకీయ పక్షాలకు ప్రజాసంఘాలకు ప్రభుత్వాల తప్పిదాలపై పోరాడే హక్కు వుందంటూనే కర్కశ చట్టాలతో కటకటాలపాలు చేయడం అత్యంత అప్రజాస్వామికం,
వినోద్‌ దువా విషయంలో అరెస్టు చేయరాదని(బలప్రయోగంవద్దని)చెప్పడం రాజద్రోహం 124(ఎ)సెక్షన్‌ను లోతుగా పరిశీలించి సమీక్షించాలని చెప్పడం మినహా మొత్తంగా ఎత్తివేయాలని నిర్దేశించలేదుౖ ఎప్‌ఐఆర్‌ నమోదును కూడా ఖండిరచలేదు,

చీప్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ హయాంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నట్టు చెబుతున్నారు గనక మౌలికంగానే మార్పుల అవసరాన్ని గుర్తించడం అవసరం,పదేళ్ల పైబడిన సీనియారిటీ వున్న జర్నలిస్టులకు సంబంధించిన కేసులలో తగు సమీక్ష తర్వాతనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావాలని వినోద్‌ దువా కోరారు. అందుకు అంగీకరించలేమని అది చట్టసభల పరిధిలో అంశమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.124(ఎ)పునర్ధర్శనం పున:పరిశీలన వంటి మాటలు ఏంచెప్పినా అవి వెంటనే అమలుకు వచ్చేవి కావు. ఐపిసిని పార్లమెంటు సవరిం చేవరకూఅలాగే వుంటాయి. మీడియాలో పొరబాటు ధోరణులను సవరించుకోవలసిందే గాని తమకువంతపాడలేదనిపాలకులు వాటి స్వేచ్చాస్వాతంత్రాలను కాలరాచివేయడం సరికాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • journalists
  • judgment
  • Supreme Court
  • telakapalli ravi
  • Treason case

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions