Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Leaders Booked In Fibernet Scam

ఫైబర్ నెట్ స్కాంలో బుక్కైన టీడీపీ నేతలు

Published Date :September 10, 2021 , 12:37 pm
By Manohar
ఫైబర్ నెట్ స్కాంలో బుక్కైన టీడీపీ నేతలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తీగ లాగితే డొంక కదిలిన చందంగా టీడీపీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్లో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు. ఇప్పటికే నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులను జైళ్లకు పంపిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడిపై ఫైబర్ నెట్ స్కాం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి.

టీడీపీ హయాంలో నారా లోకేష్ కీలకమైన ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ఏపీలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 2వేల కోట్ల వరకు గోల్ మాల్ జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయించి ఫైబర్ నెట్ స్కీములో జరిగిన అవినీతిపై సమాచారాన్ని రాబట్టింది. లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(టెరాసాఫ్ట్‌) సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నాటి ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని విచారణలో తేల్చినట్లు సమాచారం.

Also Read

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Add as a preferred
source on google

ఫైబర్‌ నెట్‌ టెండర్లలో పాల్గొనేందుకు టెరాసాఫ్ట్‌ కంపెనీ ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారంగా అయితే బిడ్‌ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాల్సి ఉంటుంది. కన్సార్టియం లీడ్‌ కంపెనీకి మూడేళ్లలో దాదాపు రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి దాదాపు రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్‌ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఏర్పాటై అప్పటికి కేవలం 8 నెలలే అయ్యిందని తేలిందట… మరోవైపు ఫైబర్‌ నెట్‌ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్‌ ఫోర్జరీ పత్రాలు సమర్పించిందినట్లు సీఐడీ గుర్తించిందని సమాచారం. లోకేష్ సన్నిహితులకు మేలు కూర్చేలా ఫోర్జరీ పత్రాలు సృష్టించి రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్‌ టెండర్లను ఆ సంస్థలకు కట్టబెట్టినట్లు సీఐడీ విచారణలో వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

నిబంధనల ప్రకారమైతే.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ నాటి ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తూ అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఇదే టీడీపీ మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది. మరోవైపు ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్‌ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని సీఐడీ తేల్చింది. అయినా వాటికి బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం.. నాసిరకం కారణాలతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో తేలింది.

ఈ ఫైబర్ నెట్ టెండర్లలో కీలకంగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణప్రసాద్‌, కె.సాంబశివరావు సహా మొత్తం 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైపీసీ తొలి నుంచి ఫైబర్ నెట్ స్కీముపై చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలితే రాబోయే రోజుల్లో టీడీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fibernet scam
  • tdp
  • TDP Leaders

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions