తీగ లాగితే డొంక కదిలిన చందంగా టీడీపీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్లో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు. ఇప్పటికే నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులను జైళ్లకు పంపిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడిపై ఫైబర్ నెట్ స్కాం…