Supreme Court: సుప్రీంకోర్టు పనివేళలు మారతాయా?.. సీనియర్ జడ్జి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్ట్ పనివేళలు మారతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఇదే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జడ్జిలు కేసులపై విచారణలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ఓ గంట ముందే విచారణలు ప్రారంభించింది.
వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. ‘నా ఉద్దేశం ప్రకారం మనం రోజూ ఉదయం 9 గంటలకే విచారణలు ప్రారంభించొచ్చు. మన పిల్లలు పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి వెళుతున్నప్పుడు మనం కనీసం 9 గంటలకైనా పని మొదలుపెట్టలేమా అని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది’ అన్నారు. ‘నేనైతే.. ఈ రోజు మాదిరిగానే రోజూ చేయాలంటాను. కోర్టులు తెరిచేందుకు ఉదయం తొమ్మిదిన్నరే సరైన సమయమనిపిస్తోంది’ అని రోహత్గి కూడా జస్టిస్ లలిత్కి సపోర్ట్గా మాట్లాడారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
‘విచారణలను ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎర్లీగానే ముగించొచ్చు. తర్వాతి రోజు విచారణకు రానున్న కేసుల ఫైల్స్ చదివేందుకు కూడా సమయం దొరుకుతుంది. ఉదయం 9 గంటలకు విధులను ఆరంభిస్తే పదకొండున్నరకు బ్రేక్ ఇవ్వొచ్చు. అర్ధ గంట బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల కల్లా ముగించొచ్చు. లంచ్ తర్వాత సాయంత్రం మరిన్ని పనులు చేసేందుకు న్యాయమూర్తులకు అదనపు సమయం లభిస్తుంది’ అని లలిత్ అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ లిస్టులో జస్టిస్ లలిత్ టాప్లో ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (ఆగస్ట్ 26న) రిటైర్ అయితే తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 8 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన గనక సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అయితే కొత్త పనివేళలకు తెరతీస్తారేమోననే టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!