Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Special Focus On Telangana Congress Leaders Meeting With Rahul Gandhi

రాహుల్ తో భేటీ లో ఏం జరిగింది…?

Published Date :September 10, 2021 , 5:05 pm
By Manohar
రాహుల్ తో భేటీ లో ఏం జరిగింది…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్‌లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్‌ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్‌ వాచ్‌!

రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు!

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్‌ సమావేశమైంది. సీనియర్ నాయకులతో విడిగా వ్యక్తిగతంగా మాట్లాడేందుకు రాహుల్‌ టైమ్ ఇవ్వడంతో అనేక అంశాలను ప్రస్తావించడానికి ఓ ముఖ్యనేత చూశారట. పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదులే అందులోని అజెండాగా తెలిసింది. కానీ.. విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌.. వ్యక్తిగత భేటీలకు చెక్‌ పెట్టారు. రాహుల్‌తో సమూహిక సమావేశం ఏర్పాటు చేయించారు. దీంతో ఎన్నో అనుకుని.. ఏదో ఆశించి హస్తిన వెళ్లిన నేతలకు ఏం చేయాలో పాలుపోలేదట. రాహుల్‌ చెప్పింది విని ఉసూరుమంటూ భేటీ నుంచి బయటకొచ్చారు. రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీకి చివరి వరకు ట్రై చేసినా వీలు కాలేదని టాక్‌.

రాహుల్‌ గాంధీతో భేటీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా!

రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ రావడమే గొప్ప అనుకుంటే… పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. తనకు చివరి నిమిషంలో తెలియడంతో ఢిల్లీ వెళ్లలేకపోయానని ఆయన చెబుతున్నారు. జగ్గారెడ్డి విమానం ఎక్కరు. రైలులో మాత్రమే వెళ్తారు. కానీ.. జగ్గారెడ్డి డుమ్మా వెనక ఇంకో ప్రచారం జరుగుతోంది. సింగిల్‌గా ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో విడిగా భేటీకి చూస్తున్నారట. పైగా చాలా రోజులుగా ఆయన రాహుల్, సోనియా గాంధీల అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నారు. హస్తిన వెళ్తే.. చెప్పాల్సిన అంశాలన్నీ చెప్పేసి రావాలన్నది ఆయన ఆలోచనగా ఉందట.

అందరూ కలిసి పనిచేయాలని సూచన!

ఇక రాహుల్‌తో ముఖ్యనేతల భేటీ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని పరిస్థితులను ముగ్గురు నాయకులు ప్రస్తావించారట. రేవంత్‌, భట్టి.. మహేష్‌గౌడ్‌లు మాట్లాడినట్టు సమాచారం. పార్టీ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి MPలు, సీనియర్‌ నాయకులను పిలవాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రజెంటేషన్‌లో రాహుల్‌కు వెల్లడించారట. పీసీసీ కమిటీతోపాటు పార్టీని నడిపించడానికి బయట చాలామంది సీనియర్లు ఉన్నారని చెప్పడంతో. బయట అంటే.. AICC ఆఫీస్‌ బయట అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారట. చివరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం.

గజ్వేల్‌ సభకు రాహుల్‌ రాకపై చర్చ!
పీసీసీ కమిటీల వివరాలు చెప్పడం లేదని మధుయాష్కీ గుర్రు!

దళిత గిరిజన దండోరా సభల వివరాలను రేవంత్‌రెడ్డి అందజేశారు. గజ్వేల్‌ సభకు రావాలని రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నిక దగ్గర పడే సమయంలో రాహుల్‌ వస్తే.. ఎలక్షన్‌ కోసమే వచ్చారనే అభిప్రాయం కలుగుతుందని.. ఫలితం అనుకూలంగా లేకపోతే.. ఆ ప్రభావం మరోలా ఉంటుందని సీనియర్లు వారించారట. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై రాహుల్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడ భేటీ ముగిసిన తర్వాత ఇంఛార్జ్‌ ఠాగూర్‌తో సమావేశం అయ్యారు పార్టీ నాయకులు. పీసీసీ వేసిన కమిటీల వివరాలు తమకు చెప్పడం లేదని ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు చెప్పారట. ఆ జాబితాను ఇవ్వాలని సూచించామని రేవంత్‌ బదులివ్వగా.. మల్లీ రిపీట్‌ కాకుండా చూసుకుంటామని మరో నాయకులు రిప్లయ్ ఇవ్వడంతో ఇష్యూ క్లోజ్‌ అయింది. కాకపోతే రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీ జరగకపోవడంతోనే సీనియర్లు ఎక్కువ నిరాశ చెందినట్టు టాక్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress leaders
  • rahul gandhi
  • telangana
  • TPCC

తాజావార్తలు

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

  • Trump: చర్చలు ఫెయిల్.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వెనిజులా వ్యూహాన్ని ఇరాన్‌పై అమలుకు రెడీ!

  • US-Iran Talks: “టైమ్‌ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions