అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రాకెట్ 12 నిమిషాల్లో భూకక్ష్యను చేరుకోగానే దాని నుంచి డ్రాగన్ క్యాప్యూల్ విడిపోయింది. ఈ క్యాప్యూల్ భూమి చుట్టు తిరుగుతుంది. ఈ క్యాప్యూల్లో మొత్తం నలుగురు టూరిస్టులు ప్రయాణం చేశారు. ఈ ప్రయోగం సక్కెస్ కావడంతో స్పేస్ ఎక్స్ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అయింది.
Read: హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్…