విడాకులపై అధికారిక ప్రకటన చేసిన నాగచైతన్య, సమంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ వచ్చాయి. కానీ సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో విడాకులకు అప్లయ్ చేశారట. కోర్టు నుండి ఆదేశాలు రావడమే తరువాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని, ఆ ఆఫర్ ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే పుకార్లూ వినిపించాయి. అయితే ఇవాళ నాగచైతన్య పోస్ట్ చేసిన ట్వీట్ ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
విడాకులపై పెదవి విప్పిన చైతు
Also Read
విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు. శనివారం మధ్యాహ్నం నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ ట్వీట్ చేశాడు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని ఇక మీదట కొనసాగించడం లేదని పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని తెలిపాడు. మొత్తం మీద నాగచైతన్య తొలిసారి తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… నాగచైతన్య పెట్టిన ప్రెస్ నోట్ నే సమంత పేరు మార్చి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సో… వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ అండర్ స్టాండింగ్ అయితే బాగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధాన్ని ఇలానే కొనసాగిస్తారో లేదో చూడాలి.
Read Also: ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!