ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేదార్నాథ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత కేదార్నాథ్ వెళ్లారు.. మొదట కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు..
కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ తర్వాత మళ్లీ పునర్నిర్మించారు.. 2013 వరదల తర్వాత కేదార్నాథ్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు ప్రధాని.. సరస్వతి రిటైనింగ్ వాల్ ఆస్థపథం మరియు ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్ ఆస్థపథం, తీర్థ పురోహిత్ హౌస్లు మరియు మందాకిని నదిపై గరుడ్ చట్టి వంతెనతో సహా రూ.130 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.