పిల్లల్లో కరోనా.. సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వ ఆసుప్రతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్లోకి కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని బుధవారం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై ప్రభావం చూపుతోందని.. అంతేకాకుండా ఒకవేళ ఇండియాలో కూడా చిన్నారులు కరోనా బారినపడితే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీడియాట్రిక్ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించి.. కరోనా సోకిన చిన్నారులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా ఆసుపత్రులలోని వార్డులను సిద్ధం చేసింది. పిల్లలు కరోనా బారిన పడిన ఎలాంటి భయంలేకుండా ఆసుపత్రులకు తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read
- Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
- Russia-Ukraine: రష్యా చమురు టెర్నినల్పై ఉక్రెయిన్ భారీ దాడి.. వీడియో పంచకున్న జెలెన్స్కీ
- Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
- PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
“గత కొన్ని నెలల్లో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంతటా నీలోఫర్తో పాటు ఇతర పిల్లల వైద్య సదుపాయాలలో వైద్య మౌలిక సదుపాయాలను సృష్టించింది. వాస్తవానికి, రాబోయే కొద్ది నెలల్లో, పిల్లల కోసం నీలోఫర్ ఆసుపత్రిలో మరో 800 నుండి 1,000 పడకలు ఏర్పాటు చేయనున్నాం.” అని నీలోఫర్ ఆసుపత్రి సీనియర్ శిశువైద్యుడు డాక్టర్ నరహరి బప్పనపల్లి పేర్కొన్నారు.
‘గాంధీ ఆస్పత్రిలో చిన్నారులకు చికిత్స అందించేందుకు పీడియాట్రిక్ విభాగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మేము ప్రత్యేకమైన 300 పీడియాట్రిక్ పడకలు కాకుండా తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటు చేశాం. అయితే, ప్రజలు జాగ్రత్తలు పాటించి టీకాలు వేయించుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని’’ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు చెప్పారు.
తాజావార్తలు
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
-
Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
-
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
-
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
-
Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..