Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Prc Issue In Andhrapradesh Clash Between Unions

ఏపీలో పీఆర్సీ రగడకు పడని ఎండ్‌కార్డ్‌..!

Published Date :December 28, 2021 , 2:06 pm
By NTV WebDesk
ఏపీలో పీఆర్సీ రగడకు పడని ఎండ్‌కార్డ్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో పీఆర్సీ రగడకు ఎందుకు ఎండ్‌కార్డ్‌ పడటం లేదు? ప్రభుత్వమా లేక ఉద్యోగ సంఘాల నాయకత్వం దీనికి కారణమా? సర్కార్‌కు కలిసి వస్తున్న అంశాలేంటి? JACలో గ్రూపు తగాదాలను చూసి ఆనందిస్తోంది ఎవరు?

రెండు వారాలుగా చర్చలు జరుగుతున్న పీఆర్సీపై వీడని పీటముడి..!
గల్లా పెట్టే గలగల లాడక ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. ఇదే టైమ్‌లో ఉద్యోగ సంఘాలు జీతాలు పెంచాలని రోడ్డెక్కాయి. సాధ్యమైనంత తక్కువగా ఫిట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసి ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేయడం కామన్‌. ఆ లెక్కలు డిమాండ్స్‌కు దగ్గరగా లేకపోతే ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవు. తాజా ఎపిసోడ్‌లో రెండు వారాలకు పైగా పీఆర్సీ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అధికారులు, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలుమార్లు చర్చ నిర్వహించినా.. పీఆర్సీపై పీటముడి వీడలేదు. దీంతో అసలు సమస్యపై సచివాలయ వర్గాలు ఆసక్తిగా చెప్పుకొంటున్నాయి.

Also Read

  • US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
  • Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
  • Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
  • Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో బయటపడ్డ గ్రూప్‌ ఫైట్‌..!
అంతా ఒక్కటై ఒకే గళం వినిపించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు ఎవరి అజెండా వాళ్లు అమలు చేస్తున్నారట. దీంతో మూడు ముక్కలాటలా మారింది సమస్య. బండి శ్రీనివాస రావు, బొప్పరాజు నేతృత్వంలోని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఒక గ్రూప్‌ కాగా, సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మరో గ్రూప్‌. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దారి వేరు. ఒక బృందం లేవనెత్తే వాదనకు అధికారులు కౌంటర్‌ చేయకముందే.. పక్కనున్న మరో గ్రూప్‌ దానిని ఖండిస్తోంది. మొన్నటి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలోనూ అదే జరిగిందట.

ఉద్యోగ సంఘాల్లోనే అభిప్రాయ భేదాలు..!
బొప్పరాజు, బండి బ్యాచ్ ప్రభుత్వం చెబుతున్న 14 శాతం కాకుండా 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలేసి మరీ అధికారులు ముందు పెట్టారట. లెక్కలు వేయాలంటే ఉద్యోగుల కేడర్లు.. వివిధ శాఖల్లోని సర్వీస్‌ నిబంధనల సమగ్ర సమాచారం, మాస్టర్ స్కేల్స్‌ వంటి సంక్లిష్ట వ్యవహారాలు తెలిసి ఉండాలి. అధికారికంగా అడిగితేనే ప్రభుత్వం ఈ లెక్కలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు.. ఈ కాకి లెక్కలు ఎక్కడి నుంచి వేసుకొచ్చారు అని మండిపడ్డారట మరో నేత సూర్యనారాయణ. లెక్కలు వేసేపని ఉద్యోగ సంఘాలది కానప్పుడు అత్యుత్సాహం ఎందుకన్నది వారి వాదన. సీఎస్‌ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటి చేసిన ఫిట్‌మెంట్‌ క్యాలిక్యులేషనే తప్పని మరో నాయకుడు వెంకట్రామిరెడ్డి వాదించబోతే.. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాకే స్పందించాలి కానీ.. తెలివి తేటల ప్రదర్శన ఎందుకని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విమర్శించిందట.

ఉద్యోగ సంఘాల అనైక్యతే ప్రభుత్వానికి ప్లస్సా..!
ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి విభాగాలు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే సచివాలయ ఉద్యోగుల సంఘం వెంటనే ఎంట్రీ ఇస్తుందని టాక్‌. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకముందే ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించే పని చేస్తుంటారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామి రెడ్డిపై విరుచుకు పడుతుంటారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్న ఈ అనైక్యతే ప్రభుత్వానికి ఊరట నిస్తోందట. మధ్యలో ఎంత ఆలస్యమైతే అంత మంచిదే అన్నట్టు ఆనంద పడుతున్నారట ఆర్ధిక శాఖ ఉద్యోగులు. మరి.. ఉద్యోగ సంఘాలు విడిపోయి.. వీకైన ఈ సమయంలో పీఆర్సీ పీటముడి ఎప్పుడు వీడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • bandi srinivas rao
  • boppraju
  • cm jagan
  • employees union

తాజావార్తలు

  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

  • RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..

  • Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

  • AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్‌ఏషియా భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.!

  • US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions