NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌ ధర్నాకు అనుమతి.. వైఎస్‌ షర్మిల దీక్షకు నో పర్మిషన్..

ధాన్యం సేకరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది.. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గరకు కూడా ధర్నా తలపెట్టారు.. దీని కోసం అనుమతి కోరుతూ పోలీసులకు పర్మిషన్ అప్లై చేవారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.. దానిని పరిశీలించిన సెంట్రల్‌ జోన్‌ పోలీసులు.. కొన్ని షరతులత కూడిన అనుమతి మంజూరు చేశారు..

Read Also: పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు

మరోవైపు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తలపెట్టిన కార్యక్రమానికి మాత్రం నో చెప్పారు పోలీసులు.. వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల రైతు వేదన దీక్షకు ఇందిరాపార్క్ వద్ద అనుమతి నిరాకరించారు.. రేపు ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్‌ ఆందోళన కారణంగా.. వైఎస్‌ షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు.. దీంతో.. కామారెడ్డి నియోజకవర్గంలో 72 గంటల దీక్ష చేపట్టనున్నారు వైఎస్‌ షర్మిల.