దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లకు ఎంతో చరిత్ర వుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్లోని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది.
హబీబ్గంజ్ రైల్వే స్టేషన్లో రూ.100 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోండు తెగకు చెందిన రాణి కమలాపతి పేరును ఈ రైల్వే స్టేషన్కు ఎందుకు పెట్టాలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో వివరించింది. ఈ రైల్వే స్టేషన్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో సుందరంగా ఈ రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దారు.