రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఏం తేలింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనుకుంటున్న తరుణలో ఆ ప్లేసును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు వచ్చేసరికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక్కడి ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు తమ క్యాండిడేట్లను ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేస్తారో ఇప్పటికీ తేలకపోవడంతో అంతా అయోమయంగానే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఆ నిరుత్సాహం ఇంకా పెరగకముందే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీక్రెట్ గా ఓ సర్వే చేయిస్తున్నాడట. ఈ సర్వే ద్వారానే కాంగ్రెస్ ఉప ఎన్నిక బరిలోకి దిగే అవకాశం ఉందని రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఈ పార్టీ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్, బీజీపీల్లోకి వలసలు వెళ్లడంతో మిగతా నాయకులు పార్టీని పట్టించుకోలేదు. ఫలితంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరా పరాజయం పాలయ్యింది. అప్పటి వరకు రెండో ప్లేసులో ఉన్న పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్నామ్యాయం బీజేపీయే అన్నట్లు సాగింది. ఈ తరుణంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పోస్టుకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి అధిష్టానం టీపీసీపీ బాధ్యతలు అప్పగించింది.
Also Read
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
- Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. దళిత,గిరిజన దండోరా లాంటి సభలు పెడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.. అంతేకాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేకంగా దామోదర నర్సింహకు బాధ్యతలు అప్పగించారు. అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ను కాపాడుకుంటున్నారు. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పార్టీ తలామునకలవుతోంది. హుజూరాబాద్ బరిలో ఎవరుంటారా..? అనే విషయం ఇప్పటికీ తేలడం లేదు.
ఆ మధ్య పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పేర్లు బాగా వినిపించాయి. కొండా సురేఖ కొన్ని షరతులు పెట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెకు టికెట్ అనుమానమే అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు హుజూరాబాద్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరించడంతో కొత్త క్యాండెట్ ను హుజూరాబాద్ బరిలో దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఉప ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి పార్టీలో ఉత్సాహం తగ్గింది.
ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో రేవంత్ రెడ్డి ఓ సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? టీఆర్ఎస్ పై ప్రజల అభిప్రాయమేంటి..? గతంలోని కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలు… ఇప్పటి సంక్షేమ పథకాలకు తేడా ఏంటి..? టీఆర్ఎస్ ఏ విషయంలో వైఫల్యం చెందింది..? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు..? అభివృద్ధిపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రజలకు ప్రస్తుతం కావాల్సిన అవసరాలేంటి..? కాంగ్రెస్ వారికి ఎలా ఇవ్వాలనుకుంటోంది..? లాంటి మరికొన్ని ప్రశ్నలను సంధిస్తూ సర్వే చేయిస్తున్నారట.
రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా ఉన్నాయి. మరుగున పడిన కాంగ్రెస్ ను పైకి తేవాలంటి ఇలాంటి సర్వేలు నిర్వహించి ఆ తరువాత ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి తాము చేసే పనులు, పథకాల గురించి వివరించనున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!