Opposition unity: నేడు మమతా బెనర్జీని కలవనున్న నితీష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేసే పనిని స్వయంగా తీసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. మోడీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ సీఎం నితీష్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో గత నెలలో కోల్కతాలో మమతా బెనర్జీని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. 2024 ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ ఇతర పార్టీలతో నేతల వరుస భేటీలు అవుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాని అనే అంశంపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.
Also Read:CM Jaganmohan Reddy Tour: ఈనెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా టూర్
ప్రతిపక్షాల ఐక్యత కోసం ఆయన గత ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు మహా ప్రతిపక్ష కూటమికి పునాది వేయడానికి ఈ సమావేశం ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జనతాదళ్-యునైటెడ్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యతకు, సైద్ధాంతిక పోరాటానికి ఇదో చారిత్రాత్మక అడుగు అని అన్నారు. తాము కలిసికట్టుగా ఉన్నామని, భారత్ కోసం కలిసి పోరాడుతామని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?