‘రైతులు చనిపోయారా? మాకు తెలియదే’ అంటూ కేంద్రమంత్రి ఎద్దేవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘రైతులు చనిపోయారా? మాకు తెలియదే… పరిహారం ఎలా ఇస్తాం?’ అంటూ రైతు ఉద్యమాన్ని అవమానపరిచేలా సమాధానం ఇచ్చారు. రైతులు చేపట్టిన ఉద్యమంలో ఎంత మంది రైతులు చనిపోయారనే విషయంపై తమ వద్ద ఎలాంటి రికార్డు కానీ, డేటా కానీ లేదని పార్లమెంట్ సాక్షిగా ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ఏ ఒక్కరికీ పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Read Also: జీఎస్టీ వసూళ్లపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
నిరసనలు ఆపాలని తాము రైతు సంఘాలను పలుమార్లు కోరామని.. వ్యవసాయ చట్టాలపై 11 సార్లు చర్చలు కూడా జరిపామని కేంద్రమంత్రి తోమర్ గుర్తుచేశారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు, విపక్షాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లో ఎక్కువ మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మందికి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు రైతుల పంటకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా? అని ఓ ఎంపీ ప్రశ్నించగా.. 22 రకాల పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!