Nitish Kumar: దేశవ్యాప్తంగా పర్యటించనున్న బిహార్ సీఎం.. నితీష్ కుమార్ టార్గెట్ అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులను ఆయన ఇప్పటికే ఢిల్లీలో కలిశారు. తాజాగా దేశవ్యాప్తంగా పర్యటనకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ప్రముఖ ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read:Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి రెబెల్స్ తలనొప్పి.. అసమ్మతిని తగ్గించేదెలా?
తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్, ఆప్, వామపక్ష పార్టీల నాయకులతో లోతైన చర్చలు జరిపారు. ప్రతిపక్షాల ఐక్యతపై వారంతా అంగీకరించారు. గరిష్ట సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. బీహార్లో మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారని నితీష్ తెలిపారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
Also Read:Mirnalini Ravi: చీరకట్టులో కోలీవుడ్ ముద్దుగుమ్మ కేక పెట్టిస్తోందే
ఇక,బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. జెడి-యు కార్యాలయానికి చేరుకున్న నితీష్ కుమార్కు గులాబీ రేకుల వర్షం కురిపించి, ‘దేశ్ కా పిఎం కైసా హో నితీష్ కుమార్ జైసా హో’ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై నితీష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేంద్రంలో కూర్చున్న వ్యక్తులు పనిని నమ్మరని, కేవలం ప్రచారాన్ని మాత్రమే నమ్ముతారని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము పనిని నమ్ముతాము, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక పనులు చేస్తున్నామన్నారు. మరోవైపు, కేంద్రంలో కూర్చున్న వ్యక్తులకు పనితో సంబంధం లేదని విమర్శించారు. వారు కేవలం ప్రకటనలు చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తులకు స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి సహకారం లేదు, అందుకే వారు దేశ చరిత్రను మార్చాలనుకుంటున్నారు అని నితీష్ కుమార్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!