Nitish Kumar: దేశవ్యాప్తంగా పర్యటించనున్న బిహార్ సీఎం.. నితీష్ కుమార్ టార్గెట్ అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులను ఆయన ఇప్పటికే ఢిల్లీలో కలిశారు. తాజాగా దేశవ్యాప్తంగా పర్యటనకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ప్రముఖ ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read:Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి రెబెల్స్ తలనొప్పి.. అసమ్మతిని తగ్గించేదెలా?
తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్, ఆప్, వామపక్ష పార్టీల నాయకులతో లోతైన చర్చలు జరిపారు. ప్రతిపక్షాల ఐక్యతపై వారంతా అంగీకరించారు. గరిష్ట సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. బీహార్లో మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారని నితీష్ తెలిపారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
Also Read:Mirnalini Ravi: చీరకట్టులో కోలీవుడ్ ముద్దుగుమ్మ కేక పెట్టిస్తోందే
ఇక,బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. జెడి-యు కార్యాలయానికి చేరుకున్న నితీష్ కుమార్కు గులాబీ రేకుల వర్షం కురిపించి, ‘దేశ్ కా పిఎం కైసా హో నితీష్ కుమార్ జైసా హో’ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై నితీష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేంద్రంలో కూర్చున్న వ్యక్తులు పనిని నమ్మరని, కేవలం ప్రచారాన్ని మాత్రమే నమ్ముతారని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము పనిని నమ్ముతాము, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక పనులు చేస్తున్నామన్నారు. మరోవైపు, కేంద్రంలో కూర్చున్న వ్యక్తులకు పనితో సంబంధం లేదని విమర్శించారు. వారు కేవలం ప్రకటనలు చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తులకు స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి సహకారం లేదు, అందుకే వారు దేశ చరిత్రను మార్చాలనుకుంటున్నారు అని నితీష్ కుమార్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!