వేతనాలు,పెన్షన్లపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదని అన్నారు. అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుందని, ఈ తప్పుడు లెక్కల నివేదికను ఎవర్ని మోసపుచ్చడానికి తయారు చేయించారని ప్రశ్నించారు.
Read: వీడి కక్కుర్తి తగలయ్య… కరోనాకు భయపడి 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడట…
Also Read
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
- Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో చెప్పాలని అన్నారు. నెలకు ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ల కోసం రూ. 4600 కోట్లు ఖర్చు అవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయని, ఈ విషయం నిజం కాకపోతే చీఫ్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదని, ఏటా 67 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎందుకు ప్రకటించలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారని, ఏ దశలో రాష్ట్రప్రభుత్వం ఖజానాకు భారం పడుతుందో పారదర్శకంగా చెప్పాలని అన్నారు. ప్రతీ ఏటా ప్రభుత్వ ఉద్యోగం నుంచి సుమారు 15 వేల మంది రిటైర్ అవుతున్నారని, ఆ మేరకు భర్తీ జరగడంలేదని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, మరి ఏ విధంగా వ్యయం పెరిగిందో వెల్లడించాలని జనసేన నేత ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఎక్కువగా జీతాలకు ఇస్తున్నామని చెప్పడం ఆర్థికశాఖ దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తుందని, ఈ తప్పుడు లెక్కలపై ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!