ఊరనాటుగా ‘ట్రిపుల్ ఆర్’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ మొత్తానికీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వచ్చిన పాట కావడం, పైగా ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపి, భారీ అంచనాలను నమోదు చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఓ భారీ భవంతి ముందు, మ్యూజ్ సెటప్ లో ఈ సాంగ్ ను ఈ పాటను తెరకెక్కించి, రాజమౌళి కనువిందు చేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా ఎన్టీయార్, చెర్రీ వేసిన స్టెప్స్ సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి.
Read Also : బిగ్ బ్రేకింగ్: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబోస్ తనదైన శైలిలో అంత్య ప్రాసలతో రాసిన ఈ పాటను అంతే జోష్ తో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు కీరవాణి తనయుడు కాలభైరవ పాడటం విశేషం. కీరవాణి సమకూర్చిన స్వరాలు వీనుల విందుగా ఉంటే, సెంథిల్ సినిమాటోగ్రఫీ ఐఫీస్ట్ ను కలిగించింది. డీవీవీ దానయ్య అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ వాల్యూస్ సైతం ఈ పాటలో కనిపిస్తున్నాయి. డాన్సింగ్ డైనమేట్స్ తో లెగ్స్ షేక్ చేసే టైమ్ వచ్చిందని రాజమౌళి చెప్పినట్టుగానే ఈ పాటకు కోట్లాది మంది తమ లెగ్స్ షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఎన్టీఆర్, చెర్రీతో పాటు ఒలివియా మోరిస్ సైతం స్టెప్టులేయడం ఈ సాంగ్ లోని మరో హైలైట్. కోట్లాది మందికి ఈ పాట కాలర్ ట్యూన్ కావడమే కాదు, ఈ పాటలో మన హీరోలు వేసిన సిగ్నేచర్ స్టెప్ ను అనుకరిస్తూ, డిజిటల్ మీడియాపై వారి అభిమానులు దాడి చేయడం ఖాయం. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించడం మొదటి నిమిషం నుండే మొదలు పెట్టేసింది. ఈ పాటకు జనవరి 7న థియేటర్లు ఏ స్థాయిలో దద్దరిల్లిపోతాయో ఇప్పటి నుండే ఊహించుకోవచ్చు!
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!