BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు వ్యూహాలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా లోక్సభ ఎంపీ సీపీ జోషిని నియమించింది. బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించడానికి జోషిని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాంలో భాగమే అనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: TSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్.. టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం
రాజస్థాన్లో రెండు ప్రధాన కులాలు ఉన్నాయి. రాజ్పుత్లు, జాట్ల ఓట్లే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చిత్తోర్గఢ్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన 47 ఏళ్ల జోషి.. గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో అత్యధిక ఓట్లతో గెలుపొందిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. రాజస్థాన్ బీజేపీలోని ఏ వర్గంతోనూ పొత్తుపెట్టుకోని ఆయన పార్టీలకతీతంగా ఉంటారని భావిస్తున్నారు. అతను రాజస్థాన్లో బిజెపికి అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ అయిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సన్నిహితంగా లేరు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
Also Read
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. గత రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు. కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తోందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్, ఒడిశా, ఢిల్లీలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. ఇతర వెనుకబడిన వర్గ నాయకుడు, శాసన మండలి సభ్యుడు సామ్రాట్ చౌదరి పార్టీ బీహార్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ఒడిశాలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవా రాజధానిలో పార్టీ చీఫ్గా ఎదిగారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..