BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు వ్యూహాలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా లోక్సభ ఎంపీ సీపీ జోషిని నియమించింది. బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించడానికి జోషిని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాంలో భాగమే అనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: TSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్.. టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం
రాజస్థాన్లో రెండు ప్రధాన కులాలు ఉన్నాయి. రాజ్పుత్లు, జాట్ల ఓట్లే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చిత్తోర్గఢ్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన 47 ఏళ్ల జోషి.. గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో అత్యధిక ఓట్లతో గెలుపొందిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. రాజస్థాన్ బీజేపీలోని ఏ వర్గంతోనూ పొత్తుపెట్టుకోని ఆయన పార్టీలకతీతంగా ఉంటారని భావిస్తున్నారు. అతను రాజస్థాన్లో బిజెపికి అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ అయిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సన్నిహితంగా లేరు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
Also Read
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. గత రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు. కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తోందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్, ఒడిశా, ఢిల్లీలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. ఇతర వెనుకబడిన వర్గ నాయకుడు, శాసన మండలి సభ్యుడు సామ్రాట్ చౌదరి పార్టీ బీహార్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ఒడిశాలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవా రాజధానిలో పార్టీ చీఫ్గా ఎదిగారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!