BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు వ్యూహాలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా లోక్సభ ఎంపీ సీపీ జోషిని నియమించింది. బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించడానికి జోషిని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాంలో భాగమే అనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: TSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్.. టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం
రాజస్థాన్లో రెండు ప్రధాన కులాలు ఉన్నాయి. రాజ్పుత్లు, జాట్ల ఓట్లే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చిత్తోర్గఢ్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన 47 ఏళ్ల జోషి.. గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో అత్యధిక ఓట్లతో గెలుపొందిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. రాజస్థాన్ బీజేపీలోని ఏ వర్గంతోనూ పొత్తుపెట్టుకోని ఆయన పార్టీలకతీతంగా ఉంటారని భావిస్తున్నారు. అతను రాజస్థాన్లో బిజెపికి అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ అయిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సన్నిహితంగా లేరు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. గత రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు. కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తోందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్, ఒడిశా, ఢిల్లీలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. ఇతర వెనుకబడిన వర్గ నాయకుడు, శాసన మండలి సభ్యుడు సామ్రాట్ చౌదరి పార్టీ బీహార్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ఒడిశాలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవా రాజధానిలో పార్టీ చీఫ్గా ఎదిగారు.
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!