NTV Telugu Site icon

ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారు : మంత్రి వెల్లంపల్లి

ఏపీలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వంగవీటి రాధా రెక్కీ అంశంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని ఆయన అన్నారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలి, రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదు ఆయన అన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదని ఆయన హితవు పలికారు.

రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారు రాధా తెలుసుకోవాలని, టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారన్నారు. చంద్రబాబుతో ప్రభుత్వంపై రాధా మాట్లాడిస్తున్నారని, రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా ? అంటూ ప్రశ్నించారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది, అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుద్దా ? హత్యా రెక్కీ అంటారు, భద్రతకి గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే స్పందించిన వ్యక్తి సీఎం జగన్ అని, రాధా మా పార్టీకి సంబంధంలేని వ్యక్తయినా గన్ మెన్లను కేటాయించారన్నారు.