‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్: జగన్ ని రిక్వెస్ట్ చేస్తున్న చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు.
మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్న పిల్లలు కరోనా తరువాత స్కూల్ కి వెళితే ఎలా వుంటుందో ఈ ఫంక్షన్ నాకు అలా వుంది. ఇలా ఫంక్షన్స్ కి వచ్చి ఈలలు వింటూ వుంటే ఆ కిక్కే వేరు. నారాయణ్ దాస్ నారంగ్ గారు నాకు ఎంతో సన్నిహితులు. వాళ్ల అబ్బాయి సునీల్ తండ్రికి మించిన తనయుడు. వీళ్ళు మరింత ఎత్తుకి ఎదగాలి మరిన్ని సినిమాలు తీయాలి. నాగ్ కొడుకు చైతన్య చాలా కూల్ గా వుంటాడు. చాలా నిలకడగా, నిదానంగా వుంటాడు.. అతను తీసుకొనే నిర్ణయాలు చాలా కాంసెంట్రీవ్. సాయిపల్లవి వెరీ గుడ్ డాన్సర్. ఒక సినిమాలో సాయిపల్లవి నా చెల్లెలి క్యారెక్టర్ వెయ్యాలి కానీ చెయ్యను అంది అలా ఎందుకు అన్నది నాకు తెలీదు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
శేఖర్ కమ్ముల తనకు తాను ఏమనుకుంటారో అదే తీస్తారు కమర్షియల్ అంశాలు పట్టించుకోరు. అందుకే ఆయన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి. ‘సారంగాధరియా’ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ సాంగ్ కోసం నేను ఈసినిమా రెండు మూడు సార్లు చూస్తాను.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 20% మాత్రమే. దీనికి సినిమా వాళ్ళు అందరూ పచ్చగా వున్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. ప్రమాదాలు వచ్చినా, ఏ విపత్తు వచ్చినా స్పందించేది ఫస్ట్ సినిమా ఇండస్ట్రీనే. రెండు తెలుగు ప్రభుత్వాలకు నేను విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు కూడా పరిష్కరించండి. దయచేసి రెండు తెలుగు ప్రభుత్వాలు సినీ పరిశ్రమ సమస్యలపై దృష్టి పెట్టి జీవో ఇవ్వాల్సిందిగా విన్నపం’ అంటూ చిరంజీవి కోరారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!