“లవ్ స్టోరీ”కి నిరాశ తప్పదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.
ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ఇప్పటికీ 50% ఆక్యుపెన్సీతో నడవడం, టికెట్ రేట్ల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో సినిమా పెద్దల సమావేశం జరగాల్సి ఉంది. దీంతో ఈ భేటీ కారణంగా సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేశారు. అప్పటిలోపు ఈ సమావేశం జరిగి సీఎం జగన్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తే అది సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు. కానీ పరిస్థితి చూస్తే “లవ్ స్టోరీ” టీంకు నిరాశ తప్పేలా కన్పించడం లేదు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
Read also : “భీమ్లా నాయక్” అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్
జగన్ తో పెద్దల మీటింగ్ పోస్ట్ పోన్ అవుతూ అక్టోబర్ మొదటి వారం వరకూ వచ్చింది. మరోవైపు “లవ్ స్టోరీ”ని సెప్టెంబర్ 24కు విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పైగా అదే రోజు నుంచి ఆంధ్రాలో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అవుతాయనే వార్తలు కూడా విన్పించాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు వాయిదా వేశారు. అందుకే మరోసారి వాయిదా వేసే సాహసం చేయడం లేదు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి పరిస్థితి ఎలా ఉన్నా విడుదల చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కంటెంట్ బాగుండడంతో ఇటీవల విడుదలైన “సీటిమార్”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ధైర్యంతో “లవ్ స్టోరీ” టీం కూడా సినిమాను విడుదల చేయబోతోంది.
ఇక “లవ్ స్టోరీ” టీం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. మాగ్జిమమ్ టికెట్ రేట్లతో 100% ఆక్యుపెన్సీతో కావాల్సినన్ని షోలను వేసుకోవడానికి అనుమతి ఉంది. సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 గా టికెట్ రేట్ నిర్ణయించారు. మరి టాలీవుడ్ మొత్తం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!