“లవ్ స్టోరీ”కి నిరాశ తప్పదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.
ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ఇప్పటికీ 50% ఆక్యుపెన్సీతో నడవడం, టికెట్ రేట్ల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో సినిమా పెద్దల సమావేశం జరగాల్సి ఉంది. దీంతో ఈ భేటీ కారణంగా సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేశారు. అప్పటిలోపు ఈ సమావేశం జరిగి సీఎం జగన్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తే అది సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు. కానీ పరిస్థితి చూస్తే “లవ్ స్టోరీ” టీంకు నిరాశ తప్పేలా కన్పించడం లేదు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
Read also : “భీమ్లా నాయక్” అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్
జగన్ తో పెద్దల మీటింగ్ పోస్ట్ పోన్ అవుతూ అక్టోబర్ మొదటి వారం వరకూ వచ్చింది. మరోవైపు “లవ్ స్టోరీ”ని సెప్టెంబర్ 24కు విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పైగా అదే రోజు నుంచి ఆంధ్రాలో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అవుతాయనే వార్తలు కూడా విన్పించాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు వాయిదా వేశారు. అందుకే మరోసారి వాయిదా వేసే సాహసం చేయడం లేదు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి పరిస్థితి ఎలా ఉన్నా విడుదల చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కంటెంట్ బాగుండడంతో ఇటీవల విడుదలైన “సీటిమార్”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ధైర్యంతో “లవ్ స్టోరీ” టీం కూడా సినిమాను విడుదల చేయబోతోంది.
ఇక “లవ్ స్టోరీ” టీం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. మాగ్జిమమ్ టికెట్ రేట్లతో 100% ఆక్యుపెన్సీతో కావాల్సినన్ని షోలను వేసుకోవడానికి అనుమతి ఉంది. సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 గా టికెట్ రేట్ నిర్ణయించారు. మరి టాలీవుడ్ మొత్తం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..