Site icon NTV Telugu

జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్‌.. వివరాలు ఇవే..

సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరుసటి రోజు 20వ తేదీన జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

వీటితో పాటు, సీఎం కేసీఆర్ త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారని సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా.. అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. ఆ సందర్భంగా నియోజక వర్గం పరిథిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 100 పడకల దవాఖానకు శంఖు స్థాపన చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సందర్భంలో జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version