అమెరికా వార్నింగ్.. వెంటాడి వేటాడి చంపుతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘన్నిస్థాన్లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన అమెరికా.. ప్రతీకార దాడులు తప్పవని.. వారిని వెంటాడి వేటాడి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది… ముందు ఉగ్రవాదుల బాంబుల మోత, వెనక తాలిబన్ల హెచ్చరిక. ఆఫ్ఘన్ దాటాలి అనుకునే వారికి ఆగస్టు 31 ఆఖరు తేది. ఇది వారి ప్రాణాలకు చివరితేదీగా మారింది. ఈ ఐదు రోజుల్లో దేశం దాటిన వాళ్లు ప్రాణాలతో ఉన్నట్టు. మిగిలి పోయిన వాళ్లు తాలిబన్ల చేతుల్లో చచ్చినట్టే. అప్ఘానిస్తాన్లో ఉన్నవారిలో ఇప్పుడు కనిపిస్తున్న భయం ఇదే. మిగిలిన ఐదు రోజుల్లో దేశం దాటి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఇక, కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి తమ పనే అని ఆఫ్ఘన్లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐసిస్-ఖోరసాన్(ఐఎస్-కే) ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి ఫొటోతో కూడిన ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. గురువారం రాత్రి కాబూల్ ఎయిర్పోర్టులో జరిగిన అత్మాహుతి, బాంబు దాడుల్లో దాదాపు 180 మంది చనిపోయారు. అందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. దీంతో.. కాబూల్లో పేలుళ్లకు బాధ్యులైనవారు తప్పక మూల్యం చెల్లించుకొంటారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
కాబూల్ పేలుళ్ల అనంతరం గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జో బై బైడెన్.. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారు హీరోలు అని అభివర్ణించారు. ఆఫ్ఘన్లోని ఐసిస్-కే స్థావరాలపై దాడికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కాబూల్లో పేలుళ్లకు బాధ్యులైన వారిని, అమెరికాకు హాని తలపెట్టాలని చూసినవారిని మేం ఎప్పటికీ మర్చిపోం.. క్షమించం.. వదిలిపెట్టం.. వెంటాడి వేటాడుతాం.. వాళ్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.. ఇక, ఆఫ్ఘన్ నుంచి పౌరులను తరలించడాన్ని ఉగ్రదాడులు అడ్డుకోలేవన్న ఆయన.. ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా అమెరికా పౌరులందరినీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ దేశం నుంచి తరలిస్తామని స్పష్టం చేశారు.. కాగా, ఆగస్టు 31 దాటితే అంతే, ఆ తర్వాత దేశం దాటే ఛాన్సే లేదని చెబుతున్నారు తాలిబన్లు. ఆ తర్వాత దేశం దాటాలంటే తగిన డాక్యుమెంట్లు, అనుమతులు కావాలని క్లియర్ కట్ గా చెప్పేశారు. అమెరికా సహా నాటో కూటమిలోని దేశాలు కూడా ఆగస్టు 31లోపు తమ మనుషుల్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. బాంబు పేలుళ్ల తర్వాత తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. ఇంతకు ముందుతో పోలిస్తే తరలింపు ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!