30 ఏళ్ళ ‘జైత్రయాత్ర’
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య తాజా చిత్రం ‘జై భీమ్’ గురించి జనం భలేగా ముచ్చటించుకుంటున్నారు. అందులో అమాయకులైన గిరిజనులను చేయని నేరాలు అంగీకరించమని పోలీసులు వేధించడం చూశాం. ఇలాంటి కథలు తెలుగు స్టార్ హీరోస్ ఎవరూ చేయడం లేదనీ కొందరు వాపోవడమూ జరిగింది. అయితే 30 ఏళ్ళ క్రితం ఈ తరహా కథల్లో మన స్టార్ హీరోస్ కూడా నటించారు. చిరంజీవి నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’, నాగార్జున నటించిన ‘జైత్రయాత్ర’ ఆ కోవకు చెందినవే. ఎక్కడో మారుమూల ఉన్న గిరిజన తండాల్లోనే కాదు, మరికొన్ని ప్రాంతాల్లోనూ కొందరు పేదవారిని, అమాయకులను బలవంతంగా పోలీసులు దొంగలుగా మార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ కథతో రూపొందిన చిత్రమే ‘జైత్రయాత్ర’. ఈ సినిమాతో ఉప్పలపాటి నారాయణరావు దర్శకునిగా పరిచయం అయ్యారు. 1991 నవంబర్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించారు.
‘జైత్రయాత్ర’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుని పేరు తేజ. అనాథాశ్రమంలో పెరిగి, లా చదువుతాడు. అతని సహ విద్యార్థిని శాంతి. వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఓ రోజు తనను పెంచి పెద్ద చేసిన ఫాదర్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి, తన ఫోటో తీసుకుని పోవడం చూస్తాడు తేజ. అతణ్ణి అనుసరిస్తాడు తేజ. అతడే తన అసలు తండ్రి అని తెలుస్తుంది. పోలీసుల కారణంగా తన తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకుంటాడు. ఊరిలో ఎంతోమంది అమాయకులు పోలీసుల బలవంతం మీద చేయని నేరాలను కూడా అంగీకరించడం చూస్తాడు. ఆ పరిస్థితిని ఎదిరిస్తాడు. తేజను కూడా పోలీసులు పట్టుకుపోయి, ఫోటో తీస్తారు. దాంతో తండ్రి బాధపడతాడు. తన కొడుకు దొంగ అనే ముద్ర వేసుకోరాదనే చిన్నప్పుడే పట్నంలో వదలివేసి వచ్చినట్టు చెబుతాడు తండ్రి. తేజ తండ్రి మాట విని నగరం చేరుకుంటాడు. అయినా, తేజ మనసు తన ఊరిచుట్టూ తిరుగుతుంది. చివరకు తన ప్రియురాలికి ఈ విషయం చెబుతాడు. వారిద్దరూ ఆ ఊరు చేరుకొని, అమాయకులలో చైతన్యం తీసుకువస్తారు. ఆ ఊరిలో తమ మనిషిగానే ఉంటూ ఓ వ్యక్తి అమాయకులను దొంగలుగా మారుస్తూ ఉంటాడు. అతని రంగు బయట పెడతాడు తేజ. అతణ్ణి చితక బాదుతాడు అతణ్ణి చంపేయకుండా ఊరి జనానికే వదిలేస్తాడు. జనం అతడి ప్రాణం తీస్తారు. చివరకు తేజను పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో విజయ్ చందర్, ఢిల్లీ గణేశ్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, నిళగల్ రవి, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ, బెనర్జీ, సత్య ప్రకాశ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చడం విశేషం. ఇందులోని పాటలను సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, అదృష్టదీపక్ రాశారు. అదృష్టదీపక్ రాసిన “ఎన్నాళ్ళమ్మా… ఎన్నేళ్ళమ్మా… లోకాన ఈ చీకటి… ” సాంగ్ అన్నిటినీ మించి ఆకట్టుకుంది. మిగిలిన పాటల్లో “ఒక్కటై వచ్చాయి…”, “నీడల్లే ఉన్నా…”, “పరుగు తీయనీ…” అలరించాయి.
అప్పట్లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా సాగిపోతున్నారు. ఆ సమయంలో నాగార్జున, విజయశాంతి జంట అనగానే అభిమానులు ఈ సినిమాపై భలే అంచనాలు పెట్టుకున్నారు. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రూపొందిన ‘జైత్రయాత్ర’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకునిగా ఉప్పలపాటి నారాయణరావుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం తమిళంలో ‘పొంగడ నీగలుమ్ ఉంగా అరసియలుమ్’ పేరుతో అనువాదమయింది.
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో